మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో సినిమా తీసి మంచి హిట్ అందుకున్నారు. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రిఐషన్స్ బ్యానర్లపై ఎంతో భారీగా నిర్మితం అయిన ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా సీనియర్ నటి టబు, ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఇకపోతే ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ పని చేయగా, కెమెరా మ్యాన్ గా పీఎస్ వినోద్ వ్యవహరించారు. ఇక సినిమా రిలీజ్ కు ముందే యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పాటలు ఎంత గొప్ప సక్సెస్ సాధించాయో అందరికీ తెలిసిందే. ఇక సామజవరగమనా, రాములో రాముల సాంగ్స్ అయితే ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ తో అత్యద్భుతమైన స్పందనతో మరింతగా దూసుకుపోయాయి. 

 

ఇకపోతే ఆ సినిమా సక్సెస్ తో ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రమ్, తన తదుపరి సినిమాని నేడు అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తదుపరి సినిమా చేస్తున్నట్లు త్రివిక్రమ్ ఆస్థాన సంస్థైన హారిక హాసిని క్రియేషన్స్ వారు నిన్న సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు కూడా కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమా మంచి సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం కూడా మంచి కమర్షియల్ హంగులతో కూడిన కథను సిద్ధం చేశారట త్రివిక్రమ్. 

 

ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మరొక్కసారి థమన్ నే తీసుకుంటున్నట్టు సమాచారం. అలానే ఈ విషయమై థమన్ తో రెండు రోజుల క్రితమే త్రివిక్రమ్ మాట్లాడినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇక అలవైకుంఠపురములో సాంగ్స్ ఎంతో గొప్ప సక్సెస్ సాధించడంతో థమన్ అయితేనే ఈ సినిమాకి కూడా న్యాయం చేయగలడని భావించారట త్రివిక్రమ్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, మరొక్కమారు అల రేంజ్ లో సాంగ్స్ మనకు రాబోయే సమ్మర్ లో వినపడనున్నాయన్నమాటే. కాగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: