సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ కి మంచి ఎనర్జీ ఇచ్చింది. వసూళ్ళ పరంగా ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. మహేష్ కి వరుసగా మూడో హిట్ ఇచ్చింది ఈ సినిమా. వసూళ్ళ పరంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల వరకు వసూలు చేసింది ఈ సినిమా. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చి విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు మహేష్ బాబు ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుత౦ వంశీ పైడపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. 

 

ఇదిలా ఉంటే తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో మహేష్ బాబు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నాడు. మీ గురించి మూడు ముక్కల్లో చెప్పండి అనే ప్రశ్నకు గానూ.. హంబుల్ హంబుల్ హంబుల్ అని చెప్పాడు. అదే విధంగా తను చాలా అణకువగా ఉంటా అని వివరించాడు. మీరు సినిమా రంగంలో మరిచిపోలేని ఘటన ఏదైనా ఉందా అనే ప్రశ్నకు గాను, మురారి సినిమా చూసిన తర్వాత మా నాన్న కృష్ణగారు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అని, తన భుజం తట్టిన సన్నివేశం అని వివరించాడు. 

 

భార్యతో కలిసి ఉన్న ప్రతిక్షణం కూడా తన జీవితంలో రొమాంటిక్ అని చెప్పాడు మహేష్. తనకు కుటుంబం కంటే ఏదీ ఎక్కువ కాదని స్పష్టం చేసారు. అలాగే తనకు ఎదుటి వాళ్ళల్లో నిజాయితీ లేకపోతే అసలు నచ్చదని అన్నాడు. నిజాయితీ లేని వాళ్ళను చూస్తే, ఒళ్ళు మంట అన్నాడు మహేష్ బాబు. అందుకే తాను అలాంటి వాళ్ళను ఎప్పుడూ దూరం పెడతా అని చెప్పేసాడు మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు విదేశాలకు వెళ్లి ఫ్యామిలీ తో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: