కైరా అద్వానీ.. ప్రస్తుతం ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.. నిజం.. ఈ భామ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆమె చేసిన పని అందరికి తెలుసు.. అంతగా ఆమె ఎం చేసింది అంటే.. 

 

ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ కేలెండర్‌పై మెరిసింది. అందులో ఏముంది ? అందరూ వస్తారు కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంది అసలు సంగతి. ఆమె అందులో డ్రెస్ లేకుండా కేవలం ఆకూని అడ్డుపెట్టుకొని ఫోటోకు పోజ్ ఇచ్చింది. ఇంకా అంతే.. ఆ ఫోటోను చుసిన కుర్రాళ్ళు అంతా ఏంటి కైరా ఇది? అసలు నీకు బుద్ధి ఉందా? అని తిట్టేస్తున్నారు. 

 

అయితే అలా తిట్టేవాళ్ళు ఒక ఎత్తు అయితే.. మరి కొందరు ఇదే ఛాన్సు అని ఆమె ఫోటోను ఓ రేంజ్ లో ఎడిట్ చేసి పడేశారు.. ఆ ఎడిటింగ్ చూస్తే వావ్ అని మాత్రమే కాదు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. ఎందుకంటే కైరా అద్వానీ ఆ రేంజ్ లో ఉంది. కైరా అద్వానీని ఓ ఫొటోలో నార్మల్ సారీతో మెరిపించగా.. మరి ఫొటోలో పద్దతిగా అచ్చ తెలుగు ఆడపిల్లల తయారు చేశారు. ఇంకా మరో ఫొటోలో అయితే అవతార్ లో హీరోయిన్ లా తయారు చేశారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

ఇంకా కైరా అద్వానీ తెలుగులో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను'లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వగా.. బాలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన 'కబీర్‌సింగ్'  సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో పాపులర్ అయిపోయింది ఈ కైరా అద్వానీ.. ప్రస్తుతం ఈ ఫొటోతో ఇండియా అంత పాపులర్ అయిపోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: