ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా ఉన్న సమయంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా హీరో మంచు విష్ణు ఓ వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా కొన్ని వాస్తవాలను ప్రజలకు తెలియ చేస్తామంటున్నాడు విష్ణు. ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో చదరంగం పేరుతో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ సిరీస్కు రాజ్ దర్శకత్వం వహించగా, ఫిబ్రవరి 20 నుంచి ఇది జీ5లో మాత్రమే ప్రత్యేకించి ప్రదర్శించబడుతుంది.
ఈ సందర్భంగా ఈ సిరీస్కు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ.. ఇది ఎన్టీ రామారావుగారు జీవించి ఉండగా అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాల్లో చిన్న ఎపిసోడ్ తీసుకుని ఇప్పటి సిట్యూయేషన్కి లింక్ చేస్తూ చేసిన చిత్రం ఇది. ఈ సినిమా చేస్తానన్నప్పుడు నాన్నగారు చాలా చాలా చెప్పారు. చాలా జాగ్రత్తగా తీయవలసిన చిత్రమిది అని. అలాగే వాస్తవాలను ప్రజలకు చూపించు అని చెప్పారు. ఈ కథ నాదగ్గరికి రాగానే ముందు నేను పరుచూరి గోపాలకృష్ణ గారిని అడిగాను. ఆయన ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా అని అన్నారు. ప్రజలకు వాస్తవాలు చూపిస్తాను. కొంత ఫిక్షన్ కలిపి తీయాలనుకుంటున్నా అన్నాను. ఆయన కూడా సరే అని హెల్ప్ చేశారు. ఇంకా దీని కోసం జీ5 వారు మరియు ఇందులో నటించిన ఆర్టిస్ట్లు అందరూ కూడా తమ సహాయ సహకారాలని అందించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాను. ఫ్యూచర్ మొత్తం డిజిటల్దే` అని అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... `ఈ వెబ్సిరీస్కి మా సినిమా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. దీని విలువ పెరుగుతుంది. అతి త్వరలో చాలా మంది సినిమా పెద్దలు కూడా ఇందులో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ కథ నాకు చెప్పినప్పుడు విష్ణు తో మోహన్బాబు ఈ సినిమాలో హీరో పాత్ర పోషిస్తే బావుంటుందని చెప్పాను. కాని అది కుదరలేదు. కాని ఆ స్థానంలో చేసిన శ్రీకాంత్ అద్భుతమైన నటనను కనబరిచారు. హీరో శ్రీకాంత్ నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఈ సినిమాలో నా పాత్ర కూడా ఉంటుంది. అది నా ఒరిజినల్ పాత్ర ఇది చాలా తక్కువ మందికి తెలుస్తది. అప్పటి తరానికి తప్ప ఇప్పటి వాళ్ళకి తెలియదు. అప్పటి కథకి ఇప్పటి సిట్యూషన్స్ కలిపి చేశారు. నా ప్రతిఘటన సినిమాలో నేను చెప్పిన రాజకీయ మీనింగ్ ఇప్పటికీ అలాగే ఉంది. దాన్ని ప్రతిబింబిచేలాగా ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఈ `చదరంగం` పెద్ద హిట్ అవుతుంది` అన్నారు.