టాలీవుడ్ లోకి చంద్రముఖి సినిమాతో రజినీకాంత్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నయనతార.  ఈ సినిమాలో నత్తిగా మాట్లాడుతూ.. సాంప్రదాయంగా కనిపించింది.  ఆ తర్వాత సూర్య నటించిన ‘గజిని’ సినిమాలో హాట్ లుక్ తో కనిపించింది నయనతార. ఈ రెండు సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో నయనతారకు వరుసగా టాలీవుడ్, కోలీవుడ్ లో ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  స్టార్ హీరోల సరసన వరుస హిట్స్ అందుకోవడంతో ఈ అమ్మడి పారితోషికం కూడా అదే రేంజ్ లో పెరిగిపోయింది. అగ్ర హీరోలతో పాటు, యువ హీరోలతోనూ ఆడిపాడుతుంది నయన్‌. ఎలాంటి పాత్రల్లో అయిన తన సత్తా చాటుతూ.. అందరి మన్నలు పొంతుతుంది నయనతార.  గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించింది.  త్వరలో బాలకృష్ణ సరసన మరోసారి కనిపించబోతుందట. 

 

దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న నయనతార గత కొంత కాలంగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తుంది. అంతే కాదు కొన్ని హర్రర్ సినిమాల్లో నటించి విజయం అందుకుంది.  తాజాగా మరోసారి హర్రర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తుంది.   గతేడాది  హారర్‌ థ్రిల్లర్‌  నేపథ్యంలో క్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ మూవీ ‘కొలైయుత్తిర్‌ కాలం’. అప్పట్లో ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది.  తాజాగా ఈ మూవీని తెలుగులో ‘వసంతకాలం’ పేరుతో విడుదల చేయనున్నారు. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు.  

 

ఇప్పటి వరకు నయన్ నటించిన సినిమాల్లో ఈ మూవీ నిజంగా థియేటర్లో ఉన్నవాళ్లను భయపెట్టే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఒక కీలకమైన పాత్రలో భూమిక నటిస్తుంది.  ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.  ఈ  ఈనెల 21న విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: