తెలుగు ఇండస్ట్రీలో టెంపర్ చిత్రం తర్వాత వరుస హిట్స్ అందుకుంటున్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేస్, జై లవకుశ, అరవింద సమేత ఇలా వరుసగా విజయాలు అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తో తన నాలుగవ చిత్రానికి రెడీ అవుతున్నారు.  రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతన్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే డెబ్బైశాతం పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ ఎవరితో నటించబోతున్నాడని మొన్నటి వరకు సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. నిన్నటితో ఈ సస్పెన్స్ కి తెర దింపారు. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నాడనే విషయం ఖరారైపోయింది. 

 

ఈ కథకు సంబంధించిన పనులు పూర్తి కాగానే ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు త్రివిక్రమ్.  ఇందుకోసం ఆయన మంచి కథ తయారు చేసే పనిలో ఉన్నారు.  అయితే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది.   ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే .. రష్మిక పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్  దర్శకత్వంలో 'అరవింద సమేత 'లోను .. 'అల వైకుంఠపురము'లోను కథానాయికగా పూజా హెగ్డేనే చేసింది.  ఆమె నటించిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అందుకున్నాయి.

 

మరి ఇదే సెంటిమెంట్ తో పూజానే తీసుకుంటారా..  ఈ సంవత్సరం సరిలేరు నీకెవ్వరు తో మంచి హిట్ అందుకుంది రష్మిక ను కూడా దృష్టిలో ఉంచుకుంటారా తెలియాలి. మరి ఎన్టీఆర్ సరసన   కొత్తగా అనిపిస్తుందనే ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసే అవకాశాలు కూడా ఎక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఇద్దరు భామలు గత ఏడాది నుంచి వరుసగా హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ లీస్ట్ లోకి వెళ్లారు. అయితే పూజా హెగ్డే మాత్రం తెలుగు, తమిళంలోనే కాదు.. బాలీవుడ్ లో కూడా మంచి సత్తా చాటుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: