తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఛలో’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన వరుస విజయాలు అందుకుంటూ మంచి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా చలామణి అవుతుంది.  గీతాగోవిందం, దేవదాస్, డీయర్ కామ్రెడ్  ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు తో వరుస విజయాలు అందుకుంది.  ఒక హీరోయిన్ సక్సెస్ ఫుల్ బాటలో నడుస్తుందంటే ఆమెపై రక రకాల రూమర్లు.. ఆరోపణలు వస్తుంటాయి.  ప్రస్తుతం ఈ అమ్మడు నితిన్ సరసన ‘భీష్మ’ చిత్రంలో నటిస్తుంది.  ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది.  ఈ సందర్బంగా ప్రమోషన్ బిజీలో ఉన్న రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు తెలుగు ఇండస్ట్రీ మంచి ఫ్లాట్ ఫామ్ అయ్యిందని.. ఇక్కడ అభిమానులు చూపిస్తున్న ప్రేమా.. ఆధరణ తన మనసకు ఎంతో సంతోసాన్ని ఇస్తున్నాయని అన్నారు.  ఇటీవల సంక్రాంతికి మహేష్ సరసన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

 

ఈ చిత్రంలో రష్మిక ‘నీకు అర్థం అవుతుందా’ అనే మేనరీజంతో నటించింది.  ఆ చిత్రంలో రష్మిక అలా అనడం ఇప్పుడు ఆ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.  కొంతమంది రష్మిక నటనను ఇష్టపడితే మరికొందరు మాత్రం సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశారు. ఈ మూవీలో నువు ఎంత ఓవరాక్షన్ చేశావో నీకు అర్థమవుతుందా అంటూ ట్రోల్ చేశారి అన్నారు.   ఈ ట్రోలింగ్ గురించి  స్పందించిన రష్మిక మందన  నేను `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో అతి చేశానని కొందరు విమర్శించారు. 

 

ఒక సూపర్ స్టార్ తో నువు నటిస్తున్నావ్.. ఎలా ఉండాలో అలా లేవు అని విమర్శలు వచ్చాయి.   నేను నాకిచ్చిన పాత్రకు న్యాయం చేశానంతే. ఆ పాత్రని దర్శకుడు అలాగే డిజైన్ చేశారు. దర్శకుడు కోరినట్టు నేను నటించాల్సిందే. ఇందులో నా సొంత ప్రయోగాలు ఏమీ లేవని అన్నారు.  వాస్తవానికి ఆ పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. అలాగే నా నటనపై వచ్చిన విమర్శలను కూడా స్వీకరిస్తాను. నేను మాత్రం ఎక్కడా ఓవర్ యాక్షన్ చేయను అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: