టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముందుగా ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్, అతి త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అలానే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్, తదుపరి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పింక్ అధికారిక తెలుగు రీమేక్ లో నటిస్తుండగా, అతి త్వరలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించనున్నారు. 

 

అయితే ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్న ఈ ముగ్గురు బడా స్టార్స్ కూడా, వచ్చే ఏడాది వేసవి సమయంలో ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలవనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అతి త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమాని జూన్ లో ప్రారంభించి రాబోయే వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాని రాబోయే సమ్మర్ కి తీసుకురానున్నట్లు నిన్న తమ అధికారిక ప్రకటనలో నిర్మాతలు తెల్పడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం పవన్ నటిస్తున్న పింక్ రీమేక్ మే లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆపై క్రిష్ దర్శకత్వంలో ఆయన నటించనున్న సినిమా దీపావళికి రానున్నట్టు చెప్తున్నారు. 

 

ఇక ఆ తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించనున్న సినిమాని రాబోయే సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక మొత్తంగా చూసుకుంటే, ఈ ముగ్గురు బడా హీరోల సినిమాలు కూడా ఒకేసారి రాబోయే వేసవి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఈ ముగ్గురు హీరోల సినిమాల మధ్య పోటీ తారా స్థాయిలో ఉంటుందని చెప్పకతప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: