'నాపేరు సూర్య' లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఆ సమయంలో చాలా మంది డైరెక్టర్లు చెప్పిన స్టోరీలు విన్న అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన 'అలా వైకుంఠపురం లో' సినిమా స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు సినిమాలు హిట్ అవడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ సినిమా కోసం బాగా కష్ట పడ్డారు. సినిమా రిలీజ్ అవ్వకముందే పాటలతో సగానికి సగం విజయాన్ని సాధించే టట్టు బయట వాతావరణం ప్రమోషన్ కార్యక్రమాలతో క్రియేట్ చేశారు. దీంతో సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకుని అల వైకుంఠ పురం లో సినిమా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే 'అలా వైకుంఠపురం లో' సినిమాయే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను పగల కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇటువంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కి అల్లు అర్జున్ నటించిన ‘అలా వైకుంఠపురం లో’ వెళ్ళబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ఈ సినిమాకి సంబంధించి రీమేక్ హక్కులను బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.

 

మరోపక్క ఇదే సినిమాని హిందీలో కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు కూడా ఇండస్ట్రీ లో టాక్ వినపడుతుంది. అంతేకాకుండా డైరెక్టర్ త్రివిక్రమ్  కూడా అల్లు అరవింద్ తో కలిసి నిర్మాతగా మారాలని అనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి బాలీవుడ్ లో ఎవరెవరు నటిస్తారో ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి. మరోపక్క ఇదే సమయంలో ఇటీవల ముంబైలో అల్లు అర్జున్ సొంతంగా ఫ్లాట్ తీసుకోవటం జరిగింది. దీంతో తాజా పరిణామాలను బట్టి చూస్తే 'అలా వైకుంఠపురం లో' సినిమాతో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: