రెండేళ్లుగా సరైన సక్సెస్ లేని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ ని అందుకని, మొత్తానికి తన సినీ కెరీర్ పరంగా మంచి బ్రేక్ సంపాదించారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎస్.ఎస్ తమన్ అందించిన సాంగ్స్ అత్యద్భుతమైన సక్సెస్ సాధించి, సినిమా యొక్క విజయంలో కీలక పాత్ర వహించాయి. సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది. 

 

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పలు యాక్షన్ అంశాలతో ఎంతో భారీగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరి పాత్రలు కూడా పూర్తి మాస్ గా ఉండనున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ లుక్ కోసం దర్శకుడు సుకుమార్ ఒక ప్రత్యేక టీమ్ ని ముంబై నుంచి పిలిపించనున్నారని, ఇక ఆ టీమ్ వారు బన్నీ డ్రస్సు లు, హెయిర్ స్టైల్, బాడీ బిల్డింగ్ తదితర అంశాల విషయమై పూర్తి కేర్ తీసుకోనున్నారని సమాచారం. 

 

ఇక ఆ ప్రత్యేక టీం కోసం సినిమా నిర్మాతలు కొంత భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు చెప్తున్నారు. అలానే రష్మిక క్యారెక్టర్ విషయమై కూడా సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, ఇక మొత్తంగా సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో దీనిని తెరకెక్కిస్తున్నారని టాలీవడ్ వర్గాల టాక్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది. అబ్బో, బన్నీ లుక్ కోసం ప్రత్యేక టీంను ఏకంగా ముంబై నుంచి పిలిపిస్తున్నారంటే, సినిమాలో మంచి మ్యాటర్ ఉండి ఉంటుందని, అలానే తప్పకుండా సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని పలువురు బన్నీ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్ చేస్తున్నారు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: