తెలుగులో ఎప్పుడూ కూడా హీరోయిన్స్ కొరత ఉంటూనే వస్తుంది. కొద్దిగా టాలెంట్ ఉండి అందంగా అనిపిస్తే చాలు ఆమెకు స్టార్ అవకాశాలు వచ్చేస్తాయి. అంతకుముందు యువ హీరోలకు ఒక కేటగిరి హీరోయిన్స్.. స్టార్స్ కు మరో కేటగిరి హీరోయిన్స్ అన్నట్టుగా పరిస్థితులు ఉండేవి. కాని ఇప్పుడు అందరికి వాళ్లే దిక్కయ్యారు. కొద్దిగా టాలెంట్ చూపిస్తే చాలు వరుసగా స్టార్ అవకాశాలు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న. కన్నడ పరిశ్రమ నుండి వచ్చి తెలుగులో చక్త్రం తిప్పుతుంది ఈ అమ్మడు.

 

ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ హీరోయిన్. దర్శకుడు వెంకీ కుడుముల ఛలో సినిమాతో ఆమెను తెలుగులోకి తీసుకొచ్చాడు. రెండేళ్ల క్రితం రిలీజైన ఆ సినిమాతోనే తను కూడా దర్శకుడిగా మారాడు వెంకీ. అయితే తన మొదటి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక రెండేళ్ల తర్వాత వెంకీ చేసిన రెండో సినిమాకు స్టార్ అయ్యింది. ఇదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఛలోతో తన వల్ల తెలుగులోకి వచ్చిన రష్మిక తన టాలెంట్ తో మంచి సినిమాల్లో నటించింది.. నటిస్తుంది.

 

గీతా గోవిందం హిట్ అవడం.. హీరోయిన్ గా ఆమెకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటం వల్ల రష్మిక కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈమధ్యనే వచ్చిన మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ అవడంతో రష్మిక కెరియర్ మరింత పుంజుకుంది. ఛలోతో ఎంట్రీ ఇప్పించిన వెంకీ కుడుముల భీష్మ సినిమాకు రష్మికను అనుకోగా ఆమె ఈ సినిమా ఒప్పుకుంటుందా లేదా అనే డౌట్ తోనే అడిగాడట. అయితే తనకు ఇంత మంచి కెరియర్ దక్కే అవకాశం కల్పించాడన్న కృతజ్ఞతతో రష్మిక భీష్మ సినిమా చేసింది. నితిన్, రష్మిక జోడీ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: