నితిన్ పంచప్రాణాలలో ఒక ప్రాణమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నితిన్ కు భేదాభిప్రాయాలు వచ్చాయి అంటే ఎవరు నమ్మరు. అయితే ఈరోజు విడుదల అవుతున్న ‘భీష్మ’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ తనకు త్రివిక్రమ్ తో వచ్చిన భేదాభిప్రాయాలను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.


తాను త్రివిక్రమ్ తో కలిసి చేసిన ‘అ ఆ’ మూవీ షూటింగ్ సమయంలో కొన్ని సీన్స్ త్రివిక్రమ్ షూట్ చేస్తున్నప్పుడు ఆ సీన్స్ తనకు నచ్చలేదని ఆ సీన్స్ ఎందుకు అంటూ తాను అప్పట్లో త్రివిక్రమ్ అభిప్రాయాలతో తీవ్రంగా విభేదించిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే త్రివిక్రమ్ తన మాటలకు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ తనను కంట్రోల్ చేస్తూ తాను ‘అ ఆ’ ఎలా తీయాలి అనుకున్నాడో అలాగే తీసిన విషయాన్ని నితిన్ ఇప్పుడు బయటపెట్టాడు.


అయితే తాను ‘అ ఆ’ లో ఏ సీన్స్ అనవసరం అనుకున్నానో ఆ సీన్స్ కు ఆమూవీ విడుదల తరువాత విపరీతమైన స్పందన రావడంతో తనపొరపాటు తెలుసుకుని త్రివిక్రమ్ ను కలిసి సారీ చెప్పిన విషయాన్ని త్రివిక్రమ్ నవ్వుతూ గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు ‘అ ఆ’ తరువాత తాను నటించే ఏసినిమా విషయంలోనూ తన సొంత అభిప్రాయాలు చెప్పకూడదని స్థిర నిర్ణయం తీసుకున్న విషయాలను వివరిస్తూ ఇప్పటికీ త్రివిక్రమ్ తో తాను విభేదించిన తన అజ్ఞానం పై తాను బాధపడుతూనే ఉన్నాను అంటూ కామెంట్ చేసాడు.  


ఇది ఇలా ఉండగా నితిన్ ఒక సాహసం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘ప‌వ‌ర్ పేట‌’ అన్న మూవీ మొదలు పెట్టాలని నితిన్ ఆలోచిస్తున్నట్లు టాక్. త‌మిళంలో ధ‌నుష్ వెట్రిమార‌న్ జోడీ చేసిన ‘వ‌డ చెన్నై’ త‌ర‌హాలో ఈ మూవీ కథ రెండు లేదా మూడు పార్టులుగా ఉంటుంది అని సమాచారం. ఈ కథ 1960 – 2020 వరకూ న‌డుస్తుంద‌ని ఇందులో క‌థ‌కు అనుగుణంగా నితిన్ 18 ఏళ్ల యువకుడిగా  40 ఏళ్ల వ్యక్తిగా 60 ఏళ్ల ముసలివాడిగా మూడు భిన్న‌మైన గెట‌ప్స్‌ లో క‌నిపించ‌డానికి రంగం సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు విడుదల అవుతున్న ‘భీష్మ’ మూవీ సక్సస్ ను బట్టి ఈ మూవీ విషయమై ఫైనల్ నిర్ణయం తీసుకుంటాడని టాక్..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: