టాలీవుడ్ లో ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు అందరూ కూడా ఇద్దరు హీరోయిన్ల చుట్టూనే తిరుగుతున్నారు. ఒకరు రష్మిక మంధన, మరొకరు పూజ హెగ్డే. అనుష్క, సమంతా, కాజల్ వంటి వాళ్ళు వయసు అయిపోవడంతో ఇప్పుడు వీళ్ళ చుట్టూనే తిరుగుతున్నారు. కెరీర్ తొలి నుంచి కూడా ఈ ఇద్దరు మంచి హీరోల పక్కనే సినిమాలు చేస్తున్నారు. ఎక్కువగా హిట్ సినిమాలే చేసారు. దీనితో పారితోషకం కూడా భారీగానే పెంచుతున్నారు ఈ ఇద్దరు హీరోయిన్లు అనేది వాస్తవ౦. ఈ ఏడాది ఇద్దరికీ మంచి ఆరంభమే. 

 

రష్మిక సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొడితే, పూజ అల వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్ళీ రష్మిక భీష్మ సినిమాతో మంచి హిట్ కొట్టింది. వరుసగా ఆఫర్లు ఆమెను వరించడం ఖాయమని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇప్పటి వరకు ఆమెకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు ఆమెకు ఉన్న క్రేజ్ వేరు అంటున్నారు. పాప ప్రచారం కూడా బాగానే చేసింది. సినిమా ప్రచారంలో ఎక్కువగా పాల్గొంది. వరుస ఇంతర్వ్యులు ఇచ్చింది. వాటిల్లో ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. 

 

ఇవన్ని కూడా ఈ సినిమాకు కలిసి వచ్చాయి అనేది వాస్తవం. ఇక ఇప్పుడు ఆమె రేంజ్ పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక పాప పారితోషకం కూడా భారీగా పెంచడమే కాకుండా స్టార్ హీరోల తో వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.  ఇప్పటికే పారితోషకం విషయం లో పాప దూకుడు గానే ఉంటుంది. కాస్త వెనక్కు తగ్గుతూ వచ్చింది. కాని ఇప్పుడు మాత్రం ఇక ఆగే ప్రసక్తే లేదు అంటున్నారు. కాగా నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా లో రష్మిక నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. సోషల్ మీడియా లో కూడా ఆమె నటన గురించి మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: