మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై బి మధు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. రవితేజ మాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమాని కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు గోపీచంద్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడం జరిగింది. ఇకపోతే నేడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 

 

ఒంగోలులో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే ఖచ్చితంగా మర్డరే అంటూ రవితేజ పలికే బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. ఇక టీజర్ మొత్తం మంచి యాక్షన్ సీన్స్ తో పాటు, రవితేజ స్టయిల్ ఆఫ్ డైలాగ్స్ తో అదరగొట్టింది. ఇక విజువల్స్, ఫైట్ సీన్స్ వంటివి టీజర్ లో ఎంతో బాగున్నాయి. కోలీవుడ్ నటుడు సముద్రఖని విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక కాసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో అదరగొట్టే వ్యూస్ తో దూసుకుపోతోంది. 

 

గతంలో రవితేజ, గోపీచంద్ ల కలయికలో వచ్చిన డాన్ శ్రీను ఫ్లాప్ అవ్వగా, బలుపు సూపర్ హిట్ కొట్టింది. ఇక ఈ క్రాక్ టీజర్ ని బట్టి చూస్తుంటే, బలుపు మాదిరిగా ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుంటుందని, అలానే గత కొద్దిరోజులుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని రవితేజకు ఇది మంచి బ్రేక్ ని ఇస్తుందని ఆయన ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే8 న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనుంది చిత్ర బృందం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: