తెలుగు ఇండస్ట్రీలో ‘దేవి’ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయిన దేవిశ్రీప్రసాద్ ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. గత కొంతకాలంగా దేవిశ్రీ అందించిన సంగీతం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాస్, క్లాస్ , బిట్స్ దేకైనా ఒకప్పుడు దేవిశ్రీప్రసాద్ అంటే ఎంతో క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేసు తమన్నా ఆక్రమించుకున్నారు అని అంటున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం లో దేవి తన సంగీతంతో ఏమాత్రం మెప్పించలేదని టాక్ వినిపించింది. ఇ దే సమయంలో అలా వైకుంఠ పురములో తమన్ తన సాంగ్స్ తో దుమ్మురేపాడు. దాంతో అప్పట్లో మహేష్ బాబు.. దేవిపై కాస్త సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.
త్వరలో మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ తీసుకుంటాం అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ఉద్దేశంలో మహేష్ బాబు లేనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అప్పట్లో సుకుమార్, కొరటాల శివ లు దేవితోనే మ్యూజిక్ చేయించుకునేవాడు. అలానే అల్లు అర్జున్ కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా దేవితో సంగీతం చేయించుకునేవారు. కానీ కొంత కాలంగా వీరి మద్య దూరం పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మహేష్ బాబు నటించి ‘సరిలేరు నీకెవ్వరు ’ మ్యూజికల్ హిట్ గా నిలువలేకపోయింది .
అలా వైకుంఠపురములో తమన్ అందించిన సంగీతం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. త్వరలో మహేష్ బాబు తన తదుపరి చిత్రానికి దేవికి బదులుగా వేరే పేర్లు వినిపిస్తున్నాయి. తమన్ ని తీసుకునే ఛాన్స్ ఉందని లేదా మణిశర్మ ని తీసుకునే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మద్య ఒక్కొక్కరుగా దేవిని దూరం పెడుతున్నారు. చిరంజీవితో కొరటాల చేస్తోన్న చిత్రానికి మొదట దేవిని తీసుకుంటారని.. కానీ ఆయన ప్లేస్ లో మణిశర్మని తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.