టాలీవుడ్ లో అడుగుపెట్టిన కొన్ని రోజుల కే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో మాస్ మహా రాజా రవితేజ ఒకరు. కెరీర్ మొదట్లో అన్ని పాత్రలు చేసిన రవి తేజ ఆ తర్వాత మాత్రం జాగ్రత్త గా సినిమాలు చేస్తూ మంచి హిట్స్ కొట్టాడు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అగ్ర హీరో గా ఎదిగాడు. అగ్ర దర్శకుల తో సినిమాలు చేయడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. దీనితో రవితేజా సినిమాలు అనగానే టాలీవుడ్ లో ఒక ఒక క్రేజ్ ఏర్పడింది అనేది వాస్తవం. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు తన కెరీర్ లోనే ఎప్పుడు లేని విధంగా ఇబ్బంది పడుతున్నాడు ఈ మాస్ హీరో. ప్రస్తుతం టాలీవుడ్ లో అతనితో సినిమా చేయడానికి దర్శకుడు ఎవరూ ముందుకి రావడం లేదని అంటున్నారు. తనకు సరైన హిట్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కూడా సంప్రదించాడు అంటున్నారు. అలాగే వంశీ పైడపల్లి సహా కొందరితో సంప్రదించినా సినిమా చేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదని టాక్. ప్రస్తుతం చేసిన దర్శకుడి తోనే సినిమా చేస్తున్నాడు. క్రాక్ సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. 

 

సినిమా టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా మే 8 న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇక ఈ సినిమా కూడా హిట్ అవ్వకపోతే మాత్రం రవితేజ కెరీర్ ఇబ్బంది పడినట్టే అనేది సిని జనాల మాట. ఇప్పటికే దర్శకులు చాలా మంది ఫాం లో ఉన్న హీరోల తోనే సినిమాలు చేయడానికి ఎక్కువ గా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రవితేజా సీనియర్ హీరో గా ఏ విధంగా ఆకట్టుకుంటాడు అనేది చూడాలి. గోపిచంద్ మలినేని దర్శకత్వం లో చేస్తున్నాడు. గతం లో రెండు సినిమాలు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: