సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్‌ 2 సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. కాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇటీవల ఆ సెట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో ముగ్గురు టెక్నీషియన్లు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇదే సందర్భంలో చాలామంది గాయపడటం జరిగింది. దీంతో ఈ వార్త సౌత్ ఇండియాలో సెన్సేషనల్ వైరల్ న్యూస్ అయ్యింది. దీంతో భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో మరణించిన ముగ్గురు టెక్నీషియన్ల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున సినిమా హీరో విలక్షణ నటుడు కమలహాసన్ ప్రకటించారు.

 

ఇదే సందర్భంలో సినిమాని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ కూడా గట్టిగానే ఆర్థిక సహాయం ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయాలను పక్కన పెడితే జరిగిన ఈ యాక్సిడెంట్ విషయంలో కమలహాసన్ ఒక నిజం దాస్తున్నట్లు తమిళ సినిమా వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే డైరెక్టర్ శంకర్ కి కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలు అయినట్లు ఆయన కాలికి చాలా గట్టిగానే జరిగిన ఘటనలో డబ్బులు తగిలినట్లు...ప్రస్తుతం నడిచే స్థితిలో కూడా లేనట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ శంకర్ కి ఎనిమిది నెలల బెడ్ రెస్ట్ అంటూ వస్తున్న వార్తలను గురించి కమలహాసన్ మాట్లాడటం లేదు.

 

జరిగిన ప్రమాదం దాని గురించి అంతటి గురించి మాట్లాడుతున్న హీరో కమలహాసన్ డైరెక్టర్ శంకర్ గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకు రాకపోవడం పట్ల కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో జరిగిన ప్రమాదం గురించి కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. ఇదే సందర్భంలో తమిళ తంబీలు సోషల్ మీడియాలో వేర్‌ ఈజ్‌ శంకర్‌.. వాట్‌ హ్యాపెన్‌ టు శంకర్‌ అంటూ ట్రెండ్‌ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ప్రమాదం గురించి మాట్లాడుతూ శంకర్ హెల్త్ కండిషన్ గురించి అప్ డేట్ శంకర్ కుటుంబ సభ్యులు అయినా ఇవ్వాలని కోరుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: