టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చిన్నతనంలో బాలరామాయణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్, ఆ సినిమాలో బాలరాముడిగా నటించి మంచి పేరు గడించాడు. ఇక ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారిన ఎన్టీఆర్, మొదటి సినిమాతో నందమూరి ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు. ఇక తరువాత రెండవ సినిమాగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక కెరీర్ పరంగా ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకుని ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

ఇకపోతే ఎన్టీఆర్ తో కలిసి సాంబ, నా అల్లుడు సినిమాల్లో నటించిన నటి జెనీలియా, ఇటీవల బాలీవుడ్ లోని ఒక మీడియా ఛానల్ తో తన లైఫ్ గురించి పలు విషయాలు షేర్ చేసుకుందట. అలానే తన టాలీవుడ్ మూవీ ఎక్స్ పీరియన్స్ గురించి కూడా పలు విషయాలు జెనీలియా వెల్లడించిందట. ముందుగా సుమంత్ సరసన సత్యం సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆమెకు ఆ సినిమా మంచి హిట్ ని అందించింది. ఇక అక్కడి నుండి వరుసగా మంచి సినిమాల్లో నటించిన జెనీలియా, రితేష్ దేశముఖ్ తో వివాహం అనంతరం సినిమాలకు దూరం అయింది. అయితే తనకు తొలి సినిమానే మంచి సక్సెస్ ని అందించిందని, ఇక సిద్ధార్థతో కలిసి తాను నటించిన బాయ్స్, బొమ్మరిల్లు సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయని, ఇక బన్నీ తో చేసిన హ్యాపీ మంచి ఫీల్ ని అందించినదని, అలానే శ్రీనువైట్లతో చేసిన ఢీ, రెడీ సినిమాలు తనకు మంచి క్రేజ్ ని అందించాయని చెప్పిందట. 

 

ఇక తెలుగు హీరోల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, విష్ణు వంటి వారితో పని చేసిన అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనని, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తో చేసిన రెండు సినిమాలు అయితే ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పిందట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెట్స్ లో అందరితో ఎంతో మంచిగా ఉంటారనే టాక్ ఉంది కదా, ఆయనతో పనిచేయడం ఎలా ఉందని యాంకర్ ప్రశ్నించడంతో, ఎన్టీఆర్ పైకి అందరికీ కనిపించేంత మంచోడు కాదని, సెట్స్ లోకి వచ్చిన తరువాత తనపై విపరీతమైన జోక్స్ వేస్తూ తనను పలు విధాలుగా ఆటపట్టించి గోల గోల చేసేవాడని, అయితే ఆ విధంగా తనతో పని చేసిన అప్పటి సినిమా షూటింగ్ రోజులు ఎంతో ఆనందంగా గడిచిపోయాయని ఆమె గడిచిన రోజులను సరదాగా గుర్తుచేసుకుందట జెనీలియా.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: