కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్న సినీ ప్రముఖులు ప్రముఖ దర్శకుడు రాజామౌళి, నటుడు జగపతిబాబు. ఒకరు పట్టింది అల్ల బంగారమే అవుతుంటే మరొకరికి కెరీర్ తొలి నాళ్లలో బాగుండి ఆ తర్వాత ఇబ్బందులు ఎదురై, వేధించి, అప్పుల పాలు అయ్యే వరకు వెళ్ళాయి. ఇప్పుడు నిలబడి మళ్ళీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఇక జగపతి బాబు విషయానికి వస్తే వరుస సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 

 

లెజెండ్ సినిమాతో జగపతి బాబు దశ తిరిగిపోగా, బాహుబలి సినిమాతో రాజమౌళి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకు అగ్ర దర్శకుడిగా ఉన్నా, బాహుబలి సినిమాతో ఆయనకు వచ్చిన రేంజ్ గురించి, పాపులారిటి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం కెరీర్ లో మరో బిగ్గెస్ట్ సినిమా చేస్తున్నారు. మెగా, నందమూరి కుటుంబాలను కలిపి ఈ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఈ ఇద్దరినీ ఒక బంధం కలిపింది. వియ్యంకులను చేసింది ఒక ప్రేమ. 

 

జగపతి బాబు సోదరుడు (అన్నయ్య) రామ్ ప్రసాద్ కుమార్తె ,పూజా ప్రసాద్‌ ని, రాజమౌళి కుమారుడు కార్తికేయ ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2018 డిసెంబర్ లో ఈ వివాహం జరిగింది. నిశ్చితార్ధం వరకు కూడా ఈ వివాహం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. నిశ్చితార్ధం కూడా అత్యంత దగ్గరి బంధువులు, సన్నిహితులతో చేసారు. ఆ తర్వాత వివాహం మాత్రం అందరి సమక్షంలో గ్రాండ్ గా జరిపించారు. ఈ విధంగా రాజామౌళి, జగపతి బాబు దగ్గరి బంధువులు అయ్యారు. ఒకరి కుటుంబ కార్యక్రమాలకు ఒకరు వెళ్ళడమే కాకుండా తరుచుగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉన్నా సరే కలుస్తూ ఉంటారని టాలీవుడ్ జనం అంటారు. కాగా కార్తికేయ కూడా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: