శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా  భారతీయుడు 2 సినిమా తెరకెక్కిస్తున్నారు.  అయితే సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ జరుగుతుండగా భారీ క్రేన్ విరిగిపడటంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో పదికి గాయాలయ్యాయి. డైరెక్టర్ కూడా గాయపడ్డారు. ఈ ఘటనతో తమిళ సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.  ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలైనట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్‌ కూడా గాయపడినట్లు సమాచారం. ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై శివార్లలోని పూనమల్లిలో ఈవీపీ ఫిల్మ్ సిటీలో బుధవారం (ఫిబ్రవరి 19) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.శంకర్ సినిమా షూటింగ్‌లో పెను విషాదం చోటు చేసుకుందని కామెంట్లు పెట్టారు.

 

డైరెక్టర్ శంకర్ సహా గాయపడిన వారిని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  దేశం మొత్తాన్ని ఈ సంఘటన కలచి వేసింది. సినీ అభిమానులు షాక్ కి గురికాగా, సెలెబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  దర్శకుడు శంకర్ తో పాటు పలువురు గాయాలపాలయ్యారు. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని బయట పడ్డారు. దర్శకుడు శంకర్ చిత్రాల్లో ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఇలాంటి ఎన్నో భారీ చిత్రాలని శంకర్ విజయవంతంగా చిత్రీకరించారు. కానీ ఇప్పుడు టైం కలసి రాలేదు. ఈ  ప్రమాదానికి సంతాపంగా తమిళ చిత్ర పరిశ్రమ ఓ సభ ఏర్పాటు చేసింది.

 

ఈ సభకు సీనియర్ నటుడు రాధా రవి కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పరోక్షంగా శంకర్ పై విమర్శలు చేశారు.  రాధా రవి ఎవరో కాదు ప్రముఖ నటి రాధిక సోదరుడు.  గతంలో ఇతనిపై పలు ఆరోపణలు కడా ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం పరిపాటే. తాజాగా దర్శకులు హాలీవుడ్ స్థాయిలో సినిమాలు చేయాలనుకుంటారు.. కానీ నటీనటులు, సిబ్బంది భద్రతని మాత్రం పట్టించుకోకుండా ఎలా అని సభా ముఖంగా ప్రశ్నించారు. కాగా, పోలీసులు ఇప్పటికే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, కమల్ హాసన్, శంకర్ లకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: