మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యువ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో. ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులతో సాగిన ఈ సినిమాలో బన్నీ అదరగొట్టే పెర్ఫార్మన్స్ ని కనబరిచాడు. పూజ హెగ్డే అందం, అభినయంతో పాటు ఎస్ ఎస్ థమన్ అదిరిపోయే సాంగ్స్, పీఎస్ వినోద్ వండర్ఫుల్ ఫోటోగ్రఫి ఈ సినిమా సక్సెస్ కు మరింత తోడ్పాటుగా నిలిచాయి. 

 

సీనియర్ హీరోయిన్ టబు, మురళి శర్మ, సముద్రఖని, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, నవదీప్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్ ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికి నలభై రోజులు దాటుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని కేంద్రాల్లో మంచి కలెక్షన్ తో కొనసాగుతూనే ఉంది. 

 

ఇకపోతే ఈ సినిమాని ఈ నెల 26న ప్రముఖ డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన సన్ నెక్స్ట్ లో అందుబాటులోకి రానున్నట్లు కాసేపటి క్రితం ఒక ప్రకటన వెలువరించారు. ముందుగా ఈ సినిమా హక్కులను భారీ ధరకు దక్కించుకున్న జెమినీ టీవీ, అతి త్వరలో ఈ సినిమాని తమ ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే థియేటర్స్ లో అదరగొట్టే కలెక్షన్స్ కుమ్మేసిన ఈ సినిమా, మరొక నాలుగురోజుల్లో ప్రసారం కానున్న సన్ నెక్స్ట్ లో ఎంత మేర వ్యూస్ తో దూసుకుపోతుందో చూడాలి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని మళ్ళి మళ్ళి చూద్దామా అని భావించే ప్రేక్షకులకు ఈనెల 26 నుండి పండుగే అని తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: