దివంగత నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతి మెయిన్ క్యారెక్టర్ లో ‘రాధాకృష్ణ’ అనే సినిమాలో చేయటానికి రెడీ అయ్యారు. ఈ సినిమాని ప్రసాద్ వర్మ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాతలుగా డమరుకం శ్రీనివాస్ రెడ్డి, పుష్పాల సాగరిక, శ్రీనివాస్ కానురులు సంయుక్తంగా నిర్మించనున్నారు. దీంతో లక్ష్మీపార్వతి సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ వార్త తెలుగు రాజకీయాల్లోనూ మరియు సినిమా రంగంలోనూ హైలెట్ న్యూస్ గా మారింది. ఎన్టీఆర్ చనిపోయిన నాటినుండి రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు మరియు నందమూరి కుటుంబం నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నారు లక్ష్మీపార్వతి.

 

ఎప్పుడూ కూడా చంద్రబాబు పై మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల పై విమర్శలు చేస్తూ రాజకీయాల్లో రాణిస్తున్న లక్ష్మీపార్వతి వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఇటీవల చంద్రబాబు ఆస్తులపై కూడా హైకోర్టులో పోరాటానికి దిగారు. ఇటువంటి పరిణామాల మధ్య లక్ష్మీపార్వతి సినిమాలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాగా 'రాధాకృష్ణ' అనే ఈ సినిమాలో లక్ష్మీపార్వతి మెయిన్ రోల్ చేయటంతో ఈ వార్తపై నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఇదే సమయంలో ఈ సినిమాలో అనురాగ్, ముస్కాన్ శెట్టిలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం.

 

కాగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా ఈ సినిమాలో సరికొత్త క్యారెక్టర్ చేస్తున్నాడట. సినిమా స్టోరీ కొచ్చేసరికి కనుమరుగవుతున్న నిర్మల్‌ కొయ్య బొమ్మల కథా నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాత మాట్లాడుతూ అందరి హృదయాలను ఆకట్టుకునే విధంగా అన్ని రకాల ఎమోషన్స్ తో 'రాధా కృష్ణ' అనే ఈ అందమైన ప్రేమ రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఇంకా కమెడియన్ ఆలీ మరియు కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు కూడా నటిస్తున్నారని నిర్మాత చెప్పుకొచ్చారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: