టాలీవుడ్ లో వరుస విజయాలతో దున్నేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లు కొట్టిన సూపర్ స్టార్.. మరో సారి బాక్సాఫీస్‌ను షేక్ చేసి తన స్టామినాను నిరూపించుకున్నాడు. మహేష్ బాబు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. అయితే  సంక్రాంతి సీజన్ ముగిసినా కలెక్షన్ల వర్షం మాత్రం ఆగడం లేదు. ఇలాంటి సమయంలో మహేష్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. ఇక మహర్షింతో మంచి విజయం అందించిన వంశి పైడిపల్లితో మహేష్ తన తదుపరి సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

 

 మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో మహేష్ మాఫియా డాన్ గా కనిపిస్తారని ఓ ప్రచారం కూడా జరిగింది. కాగా తాజా సమాచారం ప్రకారం మహేష్ ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారట. ఆయన వంశీ పైడిపల్లితో కాకుండా వేరే దర్శకుడితో చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు  సినిమాలో గ్యాంగ్ స్టర్ ఎపిసోడ్‌లు మొత్తం మీద 40 నిమషాలే వుంటాయని  వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  అయితే ఈ ప్రాజెక్ట్ వంశితో కాకుండా వేరే దర్శకుడితో తీయబోతున్నారా.. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ తో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందని మహేష్ కొన్ని మార్పులు చేర్పులు చెప్పారని తెలుస్తుంది.

 

 మహేష్ చెప్పిన ప్రకారం స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తుంది. దీనితో మహేష్- వంశీ మూవీ అనుకున్న సమయానికి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. నిజానికి ఈ చిత్రం మే నుండి సెట్స్ పైకి వెళ్లాల్సివుంది. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ మద్య రూమర్లు బాగానే వస్తున్నాయి.. ఇది కూడా అలాంటి వార్తే అయి ఉంటుందని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: