లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాల‌తో టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌డుకు శ్రీ‌వాస్‌. అయితే తాజాగా ఈయన ఇంట్లో  విషాదం చోటు చేసుకుంది. శ్రీవాస్‌ తల్లి ఓలేటి అమ్మాజి(68) శనివారం కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెబుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా పురుషోత్తపట్నంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. అమ్మాజికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దర్శకుడు శ్రీవాస్ అమ్మాజికి రెండో సంతానం. ఉన్నట్టుండి ఒక్కసారిగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

 

అలాగే ఆమె మరణం పట్ల శ్రీవాస్ కుటుంబీకులు, బంధువులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం తెలియగానే సినీ ప్రముఖులు శ్రీవాస్ ని ఫోన్‌లో పరామర్శిస్తున్నారు. ఆమె అంత్యక్రియలు తూర్పుగోదావరి జిల్లాలోని పురుషోత్తమపట్నంలో జరగనున్నాయి. 2007లో గోపీచంద్‌ హీరోగా నటించిన లక్ష్యం సినిమాతో శ్రీవాస్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్‌, సాక్ష్యం సినిమాలను ఆయన తెరకెక్కించారు. వాస్త‌వానికి సాక్ష్యం సినిమాతో మాంచి హిట్ కొట్టాల్సింది దర్శకుడు శ్రీవాస్. కానీ తృటిలో తప్పిపోయి, అదృష్టం మొహం చాటేసింది. 

 

దీంతో శ్రీవాస్ గత కొంత కాలంగా డిప్రషన్ లోకి వెళ్లాడని.. మళ్లి తేరుకొని సినిమా చెయ్యాలనే కసితో ఇటీవ‌ల‌ విక్టరీ వెంకటేష్ కి అద్భుతమైన కథ చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ మరో ప్రయత్నం చేయబోతున్నారు. నిర్మాత డివివి దానయ్య కుమారుడు డివివి కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేయబోయే సినిమాకు దర్శకుడు శ్రీవాస్ ఎంపికయ్యాడు. వాస్తవానికి దర్శకుడు మారుతికి అడ్వాన్స్ ఇచ్చాడు దానయ్య. అయితే శ్రీవాస్ తెచ్చిన కథ చాలా బాగుండడంతో కొడుకు ను శ్రీవాస్ ఛేతిలో పెట్టాడు. మారుతి తో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్‌ శ్రీవాస్ డివివి కళ్యాణ్ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. 
  


 

మరింత సమాచారం తెలుసుకోండి: