భీష్మ సినిమాతో మంచి ఊపు మీదున్నాడు నితిన్. ఏడాది తర్వాత మంచి హిట్ కొట్టాడు. వెంకి కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. వసూళ్ళ పరంగా కూడా మంచి విజయమే నితిన్ కి దక్కిందనే చెప్పుకోవచ్చు. రష్మిక మంధనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో హిందీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన `అంథాధున్` సినిమాను తెలుగులో చెయ్యాలని చూస్తున్నాడు నితిన్. 

 

ఇప్పటికే ఈ సినిమా అన్ని హక్కులను దక్కించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా కు హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా నితిన్ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు మేర్లపాక మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా లో ఒక కీలక పాత్ర ఉంది. హీరో తో సమానంగా టబు కేరెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ తెలుగు లో ఎవరు చేస్తారు అనేది ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా ఆ పాత్ర కోసం ఇప్పటికే నితిన్ అనసూయను సంప్రదించాడు అంటున్నారు. ఆమె కాకపోతే టబూ నే తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. 

 

అనసూయతోపాటు మంచు లక్ష్మి, రమ్యకృష్ణ, జ్యోతిక, స్నేహ పేర్లు కూడా వినపడుతున్నాయి. ఈ సినిమా సోమవారం నుంచి లాంచనం గా మొదలవుతుంది. ప్రస్తుతం పెళ్లి చేసుకునే పని లో ఉన్న నితిన్ ఆ తర్వాత ఈ సినిమా మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు నితిన్. ఈ రెండు సినిమా లు పూర్తి అయిన తర్వాత ఈ సినిమా మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇప్పటికే భీష్మ సినిమాతో ఫాం లోకి వచ్చిన నితిన్ తర్వాతి సినిమాల విషయం లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: