ప్రముఖ సినీ నటి త్రిష మరో వివాదంలో చిక్కుకుంది. గతంలో క్రికెటర్ తో నైట్ క్లబ్ లో గొడవ పడి వివాదంలో చిక్కుకున్న త్రిష ఆ తరువాత జల్లికట్టు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేసి వివాదాల్లో నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన త్రిష ఇప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 
 
హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో 2018లో విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన 96 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో త్రిషకు హీరోయిన్ గా అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం తెలుగులో త్రిషకు ఆఫర్లు లేకపోయినప్పటికీ తమిళంలో మాత్రం త్రిష హవా కొనసాగుతోంది. తమిళంలో త్రిష పరమపదం విలయట్టు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 
 
రెండు రోజుల క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సినిమా అగ్రిమెంట్ సమయంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు, ఇంటర్వ్యూలకు హాజరవుతానని ఒప్పుకున్న త్రిష ఈవెంట్ కు డుమ్మా కొట్టింది. ఈవెంట్ కు హాజరు కావడం లేదని దర్శకనిర్మాతలకు కూడా సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకుండా త్రిష డుమ్మా కొట్టడంతో చిత్ర యూనిట్ నిర్మాతల మండలిలో హీరోయిన్ త్రిషపై ఫిర్యాదు చేసింది. 
 
నిర్మాతల మండలి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి రెండు రోజుల్లో త్రిష సినిమా ప్రమోషన్లలో పాల్గొనాలని లేని పక్షంలో నిర్మాతలకు సగం రెమ్యూనరేషన్ వెనక్కు ఇవ్వాలని సూచించింది. సినిమా ప్రమోషన్లకు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వారే హాజరు కాకపోతే నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడతారని నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనాలని ఇలాంటివి రిపీట్ చేయవద్దని త్రిషకు సూచించింది.                
 

మరింత సమాచారం తెలుసుకోండి: