దక్షిణాది చలన చిత్ర రంగంలో నిషాకళ్ల సుందరిగా పేరు తెచ్చుకుంది త్రిష.  తెలుగు లో వర్షం చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మాలీవుడ్ బ్యూటీ.  కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది త్రిష.  స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ రేస్ లో ఉంది.  ఇటీవల లేడీ ఓరియెంటెడ్, హర్రర్ తరహా చిత్రాలతో ఆకట్టుకుంటుంది త్రిష.  త్రిష హీరోయిన్ గా ఎంత గొప్ప పేరు ఉందో.. కెరీర్ లో అన్ని వావాదాలు ఉన్నాయి.  గతంలో ఆమె తన ఫ్రెండ్స్ తో మందు తాగా రోడ్డుపై హల్ చల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  తాజాగా ఈ అమ్మడు మరో చిక్కుల్లో పడ్డట్టు కోలీవుడ్ వర్గాలు చర్చలు నడుస్తున్నాయి. 

 

విషయానికి వస్తే.. ఇటీవలే తమిళంలో ’96’ మూవీలో లీడ్ రోల్‌లో నటించి బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకుంది ఈ సీనియర్ నటి.  ఈ చిత్రంలో త్రిష సరసన విజయ్ సేతు పతి నటించాడు.  ఈ చిత్రం మంచి టాక్ రావడమే కాదు.. కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది.  కాగా త్రిష తాజాగా వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం తమిళంలో త్రిష ‘పరమపదం విలయట్టు’ అనే సినిమా చేస్తోంది. ఆ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవలే గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ మద్య కొంత మంది హీరోయిన్లు ప్రమోషన్లకు  రాకుండా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి.

 

ఈ నేనథ్యంలో ‘పరమపదం విలయట్టు’ ప్రమోషన్   కార్యక్రమానికి డుమ్మా కొట్టింది ఈ సీనియర్ హీరోయిన్. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ..నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లింది. రెండు రోజుల్లో సదరు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని..లేకుంటే సగం రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నిర్మాతల మండలి. అంతే కాదు ఇక నుంచి ఎవరైనా   ఇటువంటివి రిపీట్ చేస్తే..తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: