మంచు హీరోలకి మంచి హిట్ పడి చాలా కాలం అయింది. విష్ణు, మనోజ్ అసలు సక్సస్ అన్న మాటకి ఆమడ దూరం లో ఉన్నారు. అయితే రీసెంట్ గా మంచు మనోజ్ 'అహం బ్రహ్మాస్మి' సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి అనే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మనోజ్ ఎం.ఎం.ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి అందులో మొదటి ప్రయత్నంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు- తమిళం- కన్నడ- హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని సన్నాహలు చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను తెరకెక్కించి మనోజ్ కి పాపులారిటీ తేవాలని మోహన్ బాబు చూస్తున్నారట. 

 

ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తమిళ యాంకర్ భవానీ శంకర్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తాజా సమాచారం. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను ఈ బ్యూటికి ఇదే మొదటి సినిమా. ఇక మనోజ్ హీరోగా 60కోట్ల బడ్జెట్ తో మరో సినిమాని నిర్మించనున్నానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

 

మహాశివరాత్రి సందర్భంగా మంచు మోహన్ బాబు శ్రీకాకుళం శ్రీకాళహస్తీశ్వరుని సమక్షంలో ఈ ప్రాజెక్టు కు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. త్వరలో మనోజ్ తో రూ.60 కోట్ల బడ్జెట్ తో భారీ చిత్రాన్ని నిర్మించనున్నామని.. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని తెలిపారు. అయితే హీరో మార్కెట్ ని బట్టి బడ్జెట్ ని కేటాయించాల్సి ఉంటుంది. అలా కాకుండా మనోజ్ కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేయనున్నామని మోహన్ బాబు ప్రకటించడం ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. మనోజ్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. మార్కెట్ పూర్తిగా డైలమా లో ఉన్న ఈ టైమ్ లో మోహన్ బాబు ఇంత సాహసం చేస్తున్నారా ..! అంటూ మాట్లాడుకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: