ఖైదీ నెంబర్ 150 తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్  కొట్టిన మెగాస్టార్ చిరంజీవి  గత ఏడాది సైరా తో వచ్చి మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. సైరా తరువాత చిరంజీవి ప్రస్తుతం తన 152 వ చిత్రంలో నటిస్తున్నాడు. టాప్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇక ఈ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా షూటింగ్ స్పాట్ నుండి చిరంజీవి లుక్ లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించనున్నాడని సమాచారం.
 
ఈ చిత్రంలో ఆయన నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం చరణ్, ఆర్ఆర్ఆర్ తో బిజీగా వున్నాడు. ఆ సినిమాను పూర్తి చేసి ఈ 152 లో జాయిన్ కానున్నాడు. సోషల్ మెసేజ్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా   నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించనుందని టాక్. త్వరలోనే ఈ హీరోయిన్ విషయంలో క్లారిటీ రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఈచిత్రాన్ని ఆగస్టు 14న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.    
 
ఇదిలావుంటే ఈసినిమా తరువాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయనున్నాడని తెలుస్తుంది. ఇటీవల హరీష్, చిరు ను కలిసి స్టోరీ లైన్ ను వినిపించాడట దానికి ఇంప్రెస్ అయిన చిరు ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడట. మరి ఈ కాంబోలో రానున్న సినిమా ఎప్పడు స్టార్ట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: