మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్. సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్ మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారిగా అంచనాలు నెలకొన్నాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్.టి.ఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ రాం చరణ్ సరసన నటిస్తుండగా మరో సీనియర్ హీరో అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

 

ఇక చరణ్ హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 తో కొణిదెల ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ తో 150, సైరా వంటి భారీ బడ్జెట్ సినిమాలని నిర్మించి సక్సస్ అందుకున్న చరణ్ మరో రెండు సినిమాలని నిర్మించే ప్లాన్స్ లో ఉన్నారట. ఈ రెండు కూడా మళయాళం లో సూపర్ హిట్టైన లూసీఫర్, డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమాలకి అఫీషియల్ రీమేక్ అని ఇంతకముందే తెలిసిన విషయం.

 

అయితే వీటిలో లూసీఫర్ సినిమాని మెగాస్టార్ తో రీమేక్ చేయబోతున్నాడు చరణ్. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అన్న సినిమాను విక్టరీ వెంకటేష్ తో నిర్మించాలని అనుకుంటున్నాడట చరణ్. నిజంగా చరణ్ కి ఉన్న ధైర్యమని చెప్పాలి. ఒకేసారి టాలీవుడ్ లో ఉన్న ఇద్దరు పెద్ద స్టార్ హీరోలతో సినిమాలని నిర్మించాలంటే ఎంతో దమ్ము ధైర్యం కావాలి. తలపండిపోయిన నిర్మాతలకే ఇలాంటివి సాధ్యపడతాయి. కానీ నిర్మాతగా చరణ్ కి ఉంది రెండు సినిమాల అనుభవమే. అయినా ఇద్దరు స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్ట్స్  అంటే ఇక ఎలా ఉంటుందో చెప్పండి. అందుకే మెగాస్టార్ చరణ్ లో ఉన్న ఈ ధైర్యానికి ఎంతో మురిసిపోతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: