దగ్గుబాటి రామానాయుడు.. అక్కినేని నాగేశ్వర రావు ఇద్దరు మంచి మిత్రులు.. వీరి మధ్య మంచి స్నేహ బంధం ఉండేది. అందుకే ఆ స్నేహాన్ని కాస్త బంధుత్వంగా మార్చుకోవాలని అనుకున్నారు. అందుకే వారు కొడుకు ఇష్టాన్ని నాగేశ్వర రావు.. కూతురు ఇష్టాన్ని రామనాయడు పట్టించుకోకుండా.. వీరి బంధం బలంగా అవ్వడం కోసం వాళ్ళ ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చేసేశారు.         

 

అలా బలవంతంగా పెళ్లి  చేసింది ఎవరికో కాదు.. అక్కినేని నాగేశ్వర రావు ఒక్కగానొక కుమారుడుకి.. దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మి.. వెంకటేష్ చెల్లికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ బలవంతపు పెళ్లి ఫిబ్రవరి 18, 1984లో లక్ష్మితో జరిగింది. అయితే పెళ్లి జరిగి సరిగ్గా 6 సంవత్సరాలు గడిచిన వెంటనే ఇద్దరు ఇష్టాంగానే విడాకులు తీసుకున్నారు. 

 

అలా అక్కినేని దగ్గుబాటి బంధంకు బ్రేక్ పడింది. ఇక ఇద్దరు విడాకులు తీసుకున్నాకా దగ్గుబాటి లక్ష్మి మరొకరి వివాహం చేసుకోగా.. అక్కినేని నాగార్జున కూడా అతని సహా నటి అయినా అమలను 1992లో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మికి నాగార్జునకు ఒక కొడుకు నాగ చైతన్య.. అమలకు నాగార్జునకు ఒక కోడుకు అఖిల్ ఉన్నారు.                            

 

ప్రస్తుతం నాగ చైతన్యకు టాలీవుడ్ అగ్ర నటి అయిన సమంతతో పెళ్లి జరగగా అఖిల్ కోసం సంబంధాలు చూస్తున్నారు. అయితే అక్కినేని అఖిల్ కి.. దగ్గుబాటి వెంకటేష్ కూతురుకు త్వరలోనే పెళ్లి అని సోషల్ మీడియాలో వార్తలు భారీగా వినిపిస్తున్నాయి. తండ్రి కోరిక కోసమే ఈ పెళ్లిళ్లు చెయ్యాలని అక్కినేని నాగేశ్వర రావు.. దగ్గుబాటి వెంకటేష్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి నిజం ఏంటి అనేది అఖిల్ కి పెళ్లి అయితే తప్ప తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: