ఈ జనరేషన్ హీరోలు సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని వరుస సినిమాలు అంగీకరించకుండా, సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో ఇద్దరు ముగ్గురు దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. ఈ ప్లానింగ్లో టాలీవుడ్ కోలీవుడ్ అన్న తేడా లేదు. అన్ని భాషల హీరోలు దాదాపు ఇలాగే కెరీర్ను ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓ హిట్ తరువాత మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా ఇలాంటి ప్లానింగే చేస్తున్నాడు. ఇటీవల సినిమాలతో కన్నా ఐటీ రైడ్స్, పొలిటికల్ స్టేట్మెంట్స్ లాంటి విషయాలతో ఎక్కువగా వార్తల్లో ఉన్న విజయ్, మాస్టర్ సినిమా షూటింగ్ను దాదాపుగా పూర్తి చేశాడు. ఈ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్ట్ను మాత్రం ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇప్పటికే సుధా కొంగర, వెట్రీ మారన్, పాండి రాజ్ లాంటి దర్శకుడు విజయ్కి కథలు వినిపించారు. అయితే విజయ్ మాత్రం ఏ సినిమాకు ఇంకా ఓకే చెప్పలేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుధా కొంగర చెప్పిన కథ విషయంలో విజయ్ కాస్త ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సుథ తెరకెక్కిస్తున్న `సుర్రారై పొట్టురు` (తెలుగులో `ఆకాశమే నీ హద్దురా`) సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ సినిమా రిజల్ట్ను బట్టి సుధాకు ఓకె చెప్పాల వద్దా అన్న నిర్ణయం తీసుకోనున్నాడట. ఆ తరువాత మరో దర్శకుడి పేరును పరిశీలించాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్టర్ సినిమాకు కార్తి హీరోగా తెరకెక్కిన ఖైధీ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకుడు.