మహేష్ నవ్వులో అనేక అర్థాలు ఉంటాయి అంటూ స్వయంగా చిరంజీవి చెప్పాడు. ఇప్పుడు అదే నవ్వు కొంతమంది దర్శకుల పాలిట శాపంగా మారుతుందా అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 


దర్శకుడు సుకుమార్ మహేష్ సు నమ్ముకుని దాదాపు సంవత్సరం పైగా కాలం వృథా చేసుకున్న తరువాత మహేష్ జర్క్ ఇవ్వడంతో షాక్ అయి ఏదోవిధంగా అల్లు అర్జున్ ను ఒప్పించుకుని గట్టెక్కినా ‘రంగస్థలం’ తరువాత రెండు సంవత్సరాలు కోల్పోయాడు. ఇప్పుడు లేటెస్ట్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ తో నష్టపోయాడా అంటూ వార్తలు వస్తున్నాయి. 


‘మహర్షి’ మూవీ తరువాత మహేష్ తాను వంశీ పైడిపల్లితో మరొకసారి సినిమాను చేయబోతున్నట్లు ఓపెన్ గానే చెప్పాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రమోషన్ లో కూడ ఈ విషయాన్ని మహేష్ అంగీకరించాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ మహేష్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమాను వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి చెప్పిన గ్యాంగ్ స్టర్ ఫైనల్ కథ మహేష్ కు నచ్చక పోవడంతో మరొక కథను వ్రాయమని మహేష్ సున్నితంగా సుకుమార్ కు చెప్పినట్లు టాక్. 


దీనితో మహేష్ ను నమ్ముకుని గత 6 నెలలుగా అతడి చుట్టూ తిరుగుతున్న వంశీ పైడిపల్లికి ఊహించని షాక్ అంటున్నారు. దీనితో ఇప్పుడు మహేష్ చేయబోయే కొత్త సినిమాకు సంబంధించి దర్శకుల లిస్టులో చాలామంది పేర్లు వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ దర్శకుడు పరుశు రామ్ తో పాటు అనేకమంది తమిళ దర్శకుల పేర్లు కూడ మహేష్ సినిమా విషయమై హడావిడి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మహేష్ ను నమ్ముకుని ఎవరైనా కథ చెప్పాలి అంటే దర్శకులు అంతా భయపడిపోవడమే కాకుండా మహేష్ అన్నమాటకు విలువ లేకుండా పోతోంది అంటూ కామెంట్స్ కొందరు కామెంట్స్ చేస్తూ ఇది మహేష్ కు మంచిపని కాదు అని సలహా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: