టాలీవుడ్ లో కెరటం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ బ్యాటీ రకూల్ ప్రీత్ సింగ్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నది. తర్వాత టాలీవుడ్ లో వరుస గా స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ పొజీషన్లోకి వెళ్లింది. రకూల్ తక్కువ సమయంలోనే తెలుగు, తమిళంలో నెంబర్ వన్ స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడమే కాదు కెరీర్ పరంగా మంచి పొజీషన్లో కి వచ్చింది. అంతే కాదు ఈ అమ్మడు హైదరాబాద్ లో సొంత ఇల్లు కొన్నది.. అంతే కాదు ఇక్కడ వ్యాపారం కూడా కొనసాగిస్తుంది. బాలీవుడ్ నుంచి వచ్చినా... ఇక్కడ తన ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. అయితే రకూల్ ని చాలా మంది హీరోయిన్లు ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో రష్మికా మందన్న ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. తెలుగులో 'ఛలో'తో అడుగుపెట్టి, టాప్ హీరోల పక్కన చాన్స్ కొట్టేస్తూ, సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగిన రష్మికా మందన్న, హైదరాబాద్ లో ఇల్లు కొనాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. బంజారాహిల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రష్మిక, కాసేపు మీడియాతో మాట్లాడింది. కన్నడ హీరోయిన్ అయినా తెలుగు లో మంచి స్థానం సంపాదించింది. వరుస విజయాలతో దూసుకు పోతుంది.
ఈ అమ్మడు తెలుగులో ఇంకో రెండు సినిమాల తరువాత ఇల్లు కొనుక్కుంటానని, తనకు ఇక్కడే ఉండి పోవాలని అనిపిస్తోందని అంటోందీ శాండల్ వుడ్ బ్యూటీ. అంతే కాదు ఈ మధ్య తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నానని రష్మిక తెలిపింది. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకుంటే, ఫిట్ నెస్ కు సంబంధించిన వ్యాపారం చేసుండేదాన్నని వెల్లడించింది. మూడేళ్ల క్రితం తాను హైదరాబాద్ కు వచ్చినప్పుడు బిర్యానీ తెగ తినేదాన్నని, కానీ ఇప్పుడు మాత్రం నాన్ వెజ్ తినడం మానేశానని తెలిపింది.