టాలీవుడ్ లో పెళ్లి అయినా సరే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో దూసుకుపోతున్న హీరోయిన్ సమంతా. ప్రస్తుత౦ పెళ్లి అయినా సరే తెలుగులో తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ముందుకి వెళ్తుంది. అగ్ర హీరోల సరసన ఇప్పటికే సినిమాలు చేసిన ఆమె లేడీ ఒరిఎంటెడ్ పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది సమంతా. ఇక తమిళంలో ఈమెకు ఉన్న డిమాండ్ అక్కడి అగ్ర హీరోయిన్లకు కూడా లేదనే చెప్పాలి. తాజాగా అక్కడ మూడు నుంచి నాలుగు సినిమాలను ఈ అక్కినేని వారి కోడలు లైన్ లో పెట్టేసింది.
త్వరలోనే కొన్ని సినిమాలకు సంబంధించి షూటింగ్ కూడా మొదలవుతుంది. ఇక తెలుగులో కూడా కాస్త మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మాయి. ఇదిలా ఉంటే సమంతా ఇప్పుడు మరో ఆఫర్ కి ఓకే చేసింది. ఇప్పటి వరకు వెబ్ సీరీస్ ల ద్వారా కూడా ఆకట్టుకున్న ఈ అమ్మడు రియాలిటీ షో చేయడానికి సిద్దమైంది. ఓ తెలుగు ఓటీటీ ఛానెల్ రియాలిటీ షోను ప్లాన్ చేస్తుందట. ఆ షోకు సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించనుందని, ప్రస్తుతం ఆమెతో సదరు ఓటీటీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి.
అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మన్మథుడు సమంత మావగారు, నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే బిగ్ బాస్ కి కూడా ఆయన వ్యాఖ్యాతగా చేసారు. ఇక ఇప్పుడు సమంతా కూడా చేస్తే మాత్రం అది హాట్ టాపిక్ అవ్వడం ఖాయమని అంటున్నారు టాలీవుడ్ జనాలు. కాగా సమంతా నటించిన రీమేక్ చిత్రం జానూ ఫ్లాప్ అయింది. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంతా హీరోయిన్ గా నటించింది. శర్వానంద్ హీరోగా నటించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.