టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన సరిలేరు నీకెవ్వరు తో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేనుతో హిట్ కొట్టిన మహేష్, ఆపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాతో రెండవ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇటీవల వచ్చిన సరిలేరు కూడా సక్సెస్ కావడంతో సూపర్ స్టార్ కు హ్యాట్రిక్ విజయాలు దక్కాయి. ఇక సరిలేరు విజయానందాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇటీవల విదేశాలకు వెళ్లిన సూపర్ స్టార్, ఆ టూర్ ముగించుకుని ఒక వారం రోజుల క్రితం ఇండియాకు రావడం జరిగింది. 

 

ఇక అతి త్వరలో మహేష్ బాబు, మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో నటించనన్నట్లు ఇప్పటికే కొద్దిరోజుల నుండి టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయిందంటూ నిన్నటి నుండి మరొక వార్త ప్రచారం అవుతుండడంతో, అసలు మహేష్, వంశీ తో సినిమా చేస్తున్నారా లేదా అనే దానిపై ఆయన ఫ్యాన్స్ లో ఎంతో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే వీటన్నిటికీ తెరదించుతూ, కాసేపటిక్రితం సూపర్ స్టార్ మహేష్ అఫీషియల్ పీఆర్ టీమ్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 

 

వాస్తవానికి ఇప్పటివరకు మహేష్ నటించబోయే తదుపరి 27వ సినిమాకు సంబంధించి ఇంకా ఎటువంటి ప్రాజక్ట్ ఫిక్స్ కాలేదని, ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయని, అతి త్వరలోనే ఆ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు వెల్లడించడం జరుగుంటుదని వారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దీనితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో చాలావరకు సందిగ్ధత తొలగింది. మరి మహేష్, వంశీతోనే తన తదుపరి సినిమా చేస్తారో లేక మరొక దర్శకుడికి అవకాశం ఇస్తారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: