టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు మహేష్ ఫాలోయింగ్ కి. తన తండ్రి వారసత్వాన్ని సమర్ధవంతంగా ముందుకి నడిపిస్తున్నాడు మహేష్ బాబు. మహేష్ సినిమా ఒకటి హిట్ అయితే చాలు ఇక మహేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ కి మంచి డిమాండ్ ఉంది అనేది వాస్తవం. ఆయనతో సినిమా చేయడానికి ఎందరో దర్శకలు పోటీ పడుతూ ఉంటారు అనేది ఎవరూ కాదనలేని నిజం. 

 

అలాంటి మహేష్ బాబుతో సినిమాలు చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. అవును మహేష్ తో సినిమా చెయ్యాలి అంటే నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అసలు దానికి కారణం ఏంటీ...? గతంలో మహేష్ బాబు సినిమాకు ఇంత పారితోషకం అని తీసుకునే వాడు. నిర్మాతకు వసూళ్ళతో పాటుగా ఇతర హక్కులతో వచ్చే డబ్బులు కూడా భారీగా వస్తాయి కాబట్టి ఏ ఇబ్బంది ఉండేది కాదు. కాని మహేష్ బాబు మహర్షి సినిమా తర్వాత రూటు మార్చాడు. పారితోషకం బదులు సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ అంతా తీసుకుంటున్నాడు. 

 

ఈ మధ్య ప్రీ రిలీజ్ మార్కెట్ భారీగా ఉంటుంది. సినిమా పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది దెబ్బకు. కాని మహేష్ చేస్తున్న పనికి నిర్మాతలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక మహేష్ సినిమాలు ఈ మధ్య హిట్ అవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి కూడా ఉందీ అనేది వాస్తవం. రెండు సినిమాలు హిట్ అయితే మూడో సినిమా పరిస్థితి ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. మహర్షి భరత్ అను నేను సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ ఊపులోనే చేసాడు సరిలేరు నీకెవ్వరు. నిర్మాతకు భారీ నష్టాలు తీసుకొచ్చింది. దీనితో ఇప్పుడు మహేష్ తో సినిమా చెయ్యాలి అంటే చాలు నిర్మాతలు భయపడే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: