ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే విషయంలో టాలీవుడ్ హీరోలు దూకుడుగానే ఉన్నారా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అంత అనువైన వాతావరణం లేదు అనే వార్తలు వినపడుతున్నాయి. ప్రధానంగా అమరావతిని మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో అక్కడ పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఆలోచనలో పడిపోయినట్టు తెలుస్తుంది. ఇక టాలీవుడ్ నటులు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి గతంలో ఆసక్తి చూపించినా సరే ఇప్పుడు మాత్రం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. 

 

అది పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికే మొగ్గు చూపుతున్నారు. ఆయన సొంత జిల్లా గుంటూరు లో దాదాపు 8 ఎకరాలకు పైగా భూములను తెనాలి సమీపంలో మహేష్ బాబు కొన్నట్టు సమాచారం. అదే విధంగా ముందు జాగ్రత్తలో భాగంగా విశాఖలో మధురవాడ సమీపంలో కూడా ఆయన భూములు కొన్నట్టు తెలుస్తుంది. ఇటీవల మహేష్ బాబు సినిమా షూటింగ్ అనంతరం ఒక మంత్రితో మాట్లాడారని, ఆ మంత్రి సలహా మేరకు ఆయన భూములు కొన్నారని అంటున్నారు. 

 

భవిష్యత్తులో విశాఖలో రాజధాని ఉన్నా లేకపోయినా తన భూములకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని మహేష్ బాబు భావిస్తున్నారు. అదే విధంగా విజయవాడ బందర్ రోడ్డు లో మూడు ఎకరాల కోసం కొంత మంది రైతులను కూడా మహేష్ బాబు సంప్రదించినట్టు తెలుస్తుంది. పెనమలూరు సమీపంలోని ప్రియ పచ్చళ్ళ కంపెనీకి దగ్గరలో ఆయన భూములను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారని అంటున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా మారినా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని మహేష్ భావిస్తున్నారు. తన తండ్రి కాంగ్రెస్ లో ఉన్న సమయంలో కొందరి నేతలతో పరిచయాలు ఉన్నాయి. వారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి పరిచయాలతో మహేష్ బాబు రహస్యంగా పెట్టుబడులు పెడుతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: