సూపర్ స్టార్ మహేష్ బాబు టైం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఉంది. ‘భరత్ అనే నేను’ మరియు ‘మహర్షి’ తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వరుసగా బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు. దీంతో మహేష్ అభిమానులు మంచి జోరు మీద వున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కి అదిరిపోయే టాక్ రావడంతో ముందు నుండి మహేష్ బాబు ఈ సినిమాతో హ్యాట్రిక్ పడాలని కోరుకోవడంలో అదేవిధంగా హిట్ అవటంతో మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి సోషల్ మీడియాలో సినిమా పై రకరకాల కామెంట్లు పెట్టారు. ఇటువంటి తరుణంలో మహేష్ బాబు వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా ఓకే చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ ప్రాజెక్ట్ మహేష్ బాబు పక్కన పెట్టేసినట్లు సరికొత్తగా ఇప్పుడు అందుతున్న సమాచారం.

 

విషయంలోకి వెళితే డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెచ్చిన స్టోరీలో సెకండాఫ్ లో సరైన దమ్ము లేకపోవడంతో ఆ దెబ్బతో మహేష్ ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు ఫిలిం నగర్లో పుకార్లు వస్తున్నాయి. అయితే మహేష్ కథ రిజెక్ట్ చేయడం తో నిర్మాత దిల్ రాజు కూడా అప్సెట్ అయ్యాడని తెలుస్తుంది. సినిమా ని జులై లో మొదలు పెట్టి, వచ్చే ఏడాది కి విడుదల చేయాలనీ మహేష్ భావించాడు.

 

కానీ ఇపుడు వచ్చిన ఈ గ్యాప్ కి ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో గతంలో గీత గోవిందం సినిమా డైరెక్టర్ పరుశురాం మరియు ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్లు చెప్పిన స్టోరీలను వినే పనిలో ప్రస్తుతం మహేష్ లీనమైనట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. మరి మహేష్ బాబు నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో చేస్తారన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: