ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో, విజయ్ దేవరకొండ. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా సరే అవకాశాలను కొట్టేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు ఈ హీరో. వచ్చే ఏడాది చేసే సినిమాలను కూడా లైన్లో పెట్టుకున్నాడు ఈ యువ హీరో. గత ఏడాది వచ్చిన డియర్ కామ్రేడ్, ఈ ఏడాది మొదట్లో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాలు రెండు కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్స్ గా నిలిచాయి.  ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రస్తుతం షూటింగ్ 60 శాతం పూర్తి అయిందని అంటున్నారు. కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నాడు. దీనితో అతను ఏ విధంగా నటిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా పూరి జగన్నాథ్ విడుదల చేస్తున్నాడు. హిందిలో కరణ్ జోహార్ తో కలిసి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

 

పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం రూ.50 కోట్లు వెచ్చిస్తున్నారట. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా బడ్జెట్ పరంగా భారీ సినిమా అంటున్నారు. ఇప్పటి వరకు ఈ రేంజ్ బడ్జెట్ లో అతను సినిమాలు చేయలేదు. దీనితో ఈ సినిమా ఎలా ఉంటుంది...? ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కి ఆ రేంజ్ హిట్ ఇస్తుందా...? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో ఎక్కడా వేలు పెట్టకుండా దర్శకుడు చెప్పినట్టు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: