తెలుగు లో ఇప్పటి వరకు ఎంతో మంది మాలీవుడ్ బ్యూటీలు హీరోయిన్ గా పరిచయం అయ్యారు.  అయితే కొంత మంది సక్సెస్ సాధించినా ఎక్కువ కాలం నిలవలేక పోయారు.   కానీ నయనతార, త్రిష, కాజల్ మాత్రం మంచి సక్సెస్ బాటలో నడిచారు. ఈ మద్య నేను లోకల్, నేను శైలజ, మహానటి తో తెలుగు లో నటించి మంచి పేరు సంపాదించింది కీర్తి సురేష్.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సాయి పల్లవి.  ఈ మూవీలో సాయి పల్లవి ఒక తెలంగాణ అమ్మాయిగా ఎంతో మెచ్చూర్ గా నటించింది.  బానుమతి హైబ్రీడ్ పిల్ల ఒక్కటే పీస్ అంటూ.. బాడకావ్ బొక్కలు చురువా చేస్తా అంటూ కొట్టే డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. 

 

ఈ ఒక్క చిత్రం సాయి పల్లవి ఓ రేంజ్ లో నిలబెట్టింది.  అయితే సాయి పల్లవి తెలుగు లో ఎప్పుడో పరిచయం అయ్యింది.  డీ డ్యాన్స్ షోలో సాయి పల్లవి తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో దుమ్మురేపింది.  అయితే హీరోయిన్ గా మాలీవుడ్ లో ప్రేమమ్ సినిమాతో పరిచయం అయ్యింది.   ఆ తర్వాత తెలుగు లో ఫిదా చిత్రంతో మంచి పేరు సంపాదించింది.   ఇటీవల మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, వారి భద్రతకు గానూ హైద్రాబాద్ పోలీసులు ఓ ప్రత్యేకమైన యాప్‌ను ప్రారంభించారు.

 

షీ ఎమ్ పవర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీసు విభాగం.. షీ సేఫ్ అనే యాప్‌ను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో సాయి పల్లవి తన స్పీచ్‌తో అందరి మనసులను గెలుచుకుంది.  ప్రస్తుతం తెలుగు లో వరుసగా చిత్రాల్లో నటిస్తుంది.  ప్రస్తుతం తెలుగు లో నాగ చైతన్య నటిస్తున్న ‘లవ్ స్టోరి’ చిత్రంలో నటిస్తుంది.  ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.  ఆ తర్వాత విరాట పర్వం లో రానా సరసన నటిస్తుంది.  ఇలా వరుస గా తెలుగు లో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: