తెలుగు లో ఇప్పటి వరకు ఎంతో మంది మాలీవుడ్ బ్యూటీలు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. అయితే కొంత మంది సక్సెస్ సాధించినా ఎక్కువ కాలం నిలవలేక పోయారు. కానీ నయనతార, త్రిష, కాజల్ మాత్రం మంచి సక్సెస్ బాటలో నడిచారు. ఈ మద్య నేను లోకల్, నేను శైలజ, మహానటి తో తెలుగు లో నటించి మంచి పేరు సంపాదించింది కీర్తి సురేష్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సాయి పల్లవి. ఈ మూవీలో సాయి పల్లవి ఒక తెలంగాణ అమ్మాయిగా ఎంతో మెచ్చూర్ గా నటించింది. బానుమతి హైబ్రీడ్ పిల్ల ఒక్కటే పీస్ అంటూ.. బాడకావ్ బొక్కలు చురువా చేస్తా అంటూ కొట్టే డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.
ఈ ఒక్క చిత్రం సాయి పల్లవి ఓ రేంజ్ లో నిలబెట్టింది. అయితే సాయి పల్లవి తెలుగు లో ఎప్పుడో పరిచయం అయ్యింది. డీ డ్యాన్స్ షోలో సాయి పల్లవి తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో దుమ్మురేపింది. అయితే హీరోయిన్ గా మాలీవుడ్ లో ప్రేమమ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు లో ఫిదా చిత్రంతో మంచి పేరు సంపాదించింది. ఇటీవల మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, వారి భద్రతకు గానూ హైద్రాబాద్ పోలీసులు ఓ ప్రత్యేకమైన యాప్ను ప్రారంభించారు.
షీ ఎమ్ పవర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీసు విభాగం.. షీ సేఫ్ అనే యాప్ను ప్రారంభించారు. ఈ ఈవెంట్లో సాయి పల్లవి తన స్పీచ్తో అందరి మనసులను గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగు లో వరుసగా చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం తెలుగు లో నాగ చైతన్య నటిస్తున్న ‘లవ్ స్టోరి’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత విరాట పర్వం లో రానా సరసన నటిస్తుంది. ఇలా వరుస గా తెలుగు లో నటిస్తుంది.