ఈ మద్య తెలంగాణలో గ్రీన్ చాలెంజ్ పేరిట మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే.  పర్యావరణ రక్షణకు మొక్కలు పెంచాలని తెలంగాణ నాయకులు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు సినీ నటులు కూడా పాల్గొంటున్నారు.  పలువురు సినీ సెలబ్రెటీలు గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్ లో చాలా మంది నటీ, నటులు పాల్గొన్నారు.  తాజాగా గ్రీన్ చాలెంజ్ లో ఏపి కి చెందిన ఎమ్మెల్యే, నటి రోజా పాల్గొన్నారు. అయితే ఆమె యాక్షన్ హీరో అర్జున్ తో పాల్గొనడం విశేషం.  ప్రస్తుతం అర్జున్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విలన్ ఇతర క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్నారు. 

 

ఆయన నటించిన చిత్రాలు తెలుగు లో కూడా వరుసగా వస్తున్నాయి.  ఇక ఏపిలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా తెలంగాణ ప్రజలకు మంచి సుపరిచితమే.  ఆమె జబర్ధస్త్ కార్యక్రమంలో జడ్జీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  తెలంగాణలో మొదలైన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరించింది. తాజాగా ఇప్పుడు రోజా కూడా పర్యవరణ రక్షణ కోసం నడుం బిగించింది.  గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తిగా వైసీపీ ఎమ్మెల్యే రోజా తన పేరిట 'రోజా వనం' అనే చాలెంజ్ ప్రారంభించారు. ఇది కూడా పర్యావరణ హిత కార్యక్రమం కావడం విశేషం. 

 

తాజాగా 'రోజా వనం' చాలెంజ్ లో భాగంగా సీనియర్ హీరో అర్జున్ మూడు మొక్కలు నాటారు. రోజా దగ్గరుండి మరీ అర్జున్ తో  మొక్కలు నాటించడం విశేషం అని చెప్పాలి. మొక్కలు నాటిన అనంతరం అర్జున్ మరో ముగ్గురిని నామినేట్ చేశారు.  రోజా భర్త ఆర్కే సెల్వమణి, జగపతిబాబు, ఖుష్బూకు చాలెంజ్ విసిరారు.  మొక్కలు నాటిన తర్వాత యాక్షన్ హీరో అర్జున్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న రోజా సంకల్పం అభినందనీయం అని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: