భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న వారిలో అమితాబచ్చన్ ఒకరు.  ఆయన నటించిన చిత్రాలు ఎప్పటికీ వెవర్ గ్రీన్ గా నిలిచాయి.  అమితాబచ్చన్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే అప్పట్లో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయేవారు.. థియేటర్ల సందడి ఓ రేంజ్ లో ఉండేది.  అమితాబచ్చన్ నటించిన చిత్రాలు తెలుగు లో కూడా డబ్ అయ్యేవి.  అమితాబ్, రజినీకాంత్ , కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక్పుడు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కేవలం నటుడిగానే కాకుండా కౌన్ బనేగా కరోడ్ పతి ప్రాగ్రామ్ తో బాగా పాపులర్ అయ్యారు.  ఎన్నో యాడ్స్ లో ఆయన నటించారు.  ఇటీవల అమితాబ్ ఆరోగ్యం ఇబ్బంది ఉందని వార్తలు వచ్చాయి. 

 

ఆయన తనయుడు అబిషేక్ బచ్చన్ హీరోగా రాణిస్తున్నారు.  ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అమితాబ్ కోడలు.   అమితాబచ్చన్ కి కూతురు ఉన్నారు.. ఆమె పేరు శ్వేతా బచ్చన్.. తాజాగా ఆమె వస్త్రరంగంలోకి అడుగు పెట్టారు.  వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టిన శ్వేత ప్రముఖ డిజైనర్ మోనిషా జైసింగ్ తో కలిసి ‘ఎమ్ ఎక్స్ ఎస్’ అనే బ్రాండ్ నేమ్ తో కొత్త డిజైనర్ వేర్ ను స్టార్ట్ చేసింది. కూతురు అంటే ఎంతో ప్రేమ చూపించే అమితాబ్ తాజాగా ఆమె సాధించిన సక్సెస్ తో ఉప్పొంగి పోయారు.  తన తొలి లగ్జరీ కలెక్షన్ ను ముంబైలో శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి శ్వేత డెనిమ్ జాకెట్ ధరించి హాజరైంది.

 

ఆ జాకెట్ కుడి చేయి స్వీవ్ పై తండ్రి అమితాబ్ బొమ్మ ఉంది. తాజాగా శ్వేత వేసుకున్న జాకెట్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.  ఈ సందర్భంగా అమితాబ్  ఆనందం వ్యక్తం చేసిన అమితాబ్..  ఈ ఈవెంట్ కు సబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి భావోద్వేగ సందేశం రాసుకొచ్చారు. ‘కీర్తి, గౌరవం లభించిన రోజు ఇది. మన పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు, వాళ్లు ఏదైనా సాధించినప్పుడు, మనకు ఆనందభాష్పాలు తెప్పిస్తాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: