ప్రముఖ నటి ఛార్మి కౌర్ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముందుగా నీతోడు కావాలి అనే సినిమాతో టాలీవుడ్ హీరో హీరోయిన్ గా పరిచయమైన ఛార్మి, ఆ తర్వాత పలు సినిమాల్లో మంచి పాత్రలు అందుకుని తన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఆపై తమిళ్ లో కూడా అక్కడక్కడ కొన్ని సినిమాల్లో నటించిన ఛార్మి, ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత నుండి వరుసగా పూరి తీస్తున్న సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న ఛార్మి,  ప్రస్తుతం పూరి, విజయ్ ల కలయికలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాకు కూడా సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. 

 

నిజానికి తనకు సినిమాల్లో అక్కడక్కడా కొన్ని అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా సినిమాల్లో నటించడం తనకు అంత ఆసక్తిగా లేదని, అందుకే పూర్తి స్థాయిగా నిర్మాతగా సెటిలైపోయానని ఇటీవల చార్మి పలు ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. ఇక ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసుకునే అలవాటు ఉన్న ఛార్మి, నేడు బ్లూ కలర్ టీ షర్ట్ ధరించి దిగిన ఒక ఫోటో ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ, నాకు దూరంగా ఉండండి, ఇవాళ ఆదివారం గుర్తుంది కదా అంటూ సరదాగా నవ్వుతూ ఉన్న ఎమోజీ లను ఆ ఫోటో తో పాటు పోస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఛార్మి చేసిన పోస్ట్ చేసిన ఫోటో పై పలువురు నెటిజన్లు సరదాగా ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. 

 

ఇవాళ కూడానా, ఆదివారం నావల్ల కాదు బాబోయ్ దూరంగా వెళ్ళు అంటూ ఛార్మి ఎవరిని దూరం పెడుతున్నారనేది తమకు పూర్తిగా అర్థం కానప్పటికీ, అయితే ఆమె పోస్ట్ చేసిన ఆ సరదా ఫోటోలో ఎంత ఏదో కొంత విషయం దాగి ఉందని, బహుశా సినిమా షూటింగ్ ఇవాళ ఆదివారం కూడా పెడుతున్నారా, నావల్ల కాదు దూరంగా వెళ్ళండి అంటూ ఆమె ఆ ఫోటో పోస్ట్ చేసినట్లు కాస్త అర్థం అవుతుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చార్మి పోస్ట్ చేసిన ఆ ఫోటో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: