కొన్నేళ్ళ క్రితం సినిమా రంగంలోకి నటిగా ప్రవేశించిన ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ, అప్పట్లో కమెడియన్ పద్మనాభం అలానే రాజబాబు లకు పలు సినిమాల్లో జోడీగా నటించి ఎంతో మంచి పేరు గడించారు. దాదాపుగా ఎన్నో వందల సినిమాల్లో అప్పటి అగ్ర నటుల సినిమాల్లో పలు హాస్య పాత్రల్లో నటించిన రమాప్రభ పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో నటిగా మంచి అభిప్రాయం ఉంది. ఇక కొన్నేళ్ళ క్రితం నటుడు శరత్ బాబు ని వివాహం చేసుకున్న రమాప్రభ, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన నుండి విడిపోయారు. 

 

ఇటీవల కొన్నేళ్లుగా ఒంటరిగా జీవనాన్ని కొనసాగిస్తున్న రమాప్రభ, ఎక్కువగా ఆధ్యాత్మక చింతనతో జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఒకానొక ఇంటర్వ్యూలో రమాప్రభ మాట్లాడుతూ, కొన్నాళ్ల నుండి తనకు ఒక రహస్య వ్యక్తి కొంత డబ్బును నెలనెలా పంపిస్తున్నాడు, నిజానికి ఆయన ఎవరో బయట పెట్టొద్దని తనను కోరారని, అయితే తాను మాత్రం ఆయన గురించి చెప్పకుండా ఉండలేనని, ఆయన మరెవరో కాదు దర్శకుడు పూరి జగన్నాధ్ అని చెప్పడం జరిగింది. 

 

అంతకుముందు పూరి దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో అక్కడక్కడా చిన్న పాత్రల్లో తాను నటించానని, అయితే కొన్నాళ్ల క్రితం ఒకానొక సమయంలో తన పరిస్థితిని చూసి చలించిపోయిన పూరి, ఆ తర్వాత నుండి ప్రతి నెలా కొంత మొత్తాన్ని తప్పనిసరిగా తన అకౌంట్ లో డిపాజిట్ చేస్తున్నారని ఆమె అన్నారు. అయితే అది గత జన్మల రుణానునుబంధమై ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు రమాప్రభ. లోకంలో మంచివారని చెప్పుకునే వారు ఎంతో మంది ఉన్నప్పటికీ, దానివి చేతలలో చేసి చూపించే పూరి జగన్నాథ్ వంటివారు ఎంతో అరుదుగా ఉంటారని ఆయన గురించి ఆసక్తికరంగా ఈ విధంగా వ్యాఖ్యానించారు రమాప్రభ. వేరొకరికి ఇబ్బంది కలుగకుండా మనకు తోచిన మంచిని చేసుకుంటూ వెళితే తప్పకుండా ఆ దైవం మనకు మంచి చేస్తాడని ఆమె అన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: