ఓ మహిళా ఉద్యోగినితో అసభ్యకరంగా ఫోనులో మాట్లాడి, సోషల్ మీడియాలో వైరల్ అయినా నటుడు పృథ్వీ రాజ్.. ఆ తర్వాత తన పదవిని ఊడగొట్టుకున్నాడు.. అంతే కాదు పదవిలో ఉన్నప్పుడు నోటి దూలవల్ల. చిత్ర పరిశ్రమలోని పెద్దలను ఇష్టం వచ్చినట్లుగా కించపరిచాడు.. ఈ దెబ్బతో ఒక్క సారిగా ఈ బత్తాయి బాబు చెత్తకుప్పలా మారిపోయాడు.. ఇక సినిమాల్లో ఎంత గుర్తింపు వచ్చిందో, అంతకు పది రేట్లుగా, ఆయన మాట్లాడిన ఆడియో టేప్ విషయంలో గుర్తింపు వచ్చింది. అప్పటివరకు నీతులు చెప్పే ఆయన నోట, బూతుపురాణం ఎంతో ఘాటుగా వినిపించింది.. అచ్చం సినిమాలోని పాత్రను నిజ జీవితంలో పోషించి నలుగురిచే ఛీ అనిపించుకున్న నేపధ్యంలో వైసీపీలో ఆయనను ఉంచవద్దు అనే డిమాండ్లు కూడా వినిపించాయి.
దీనితో జగన్ ఆయన్ను ఒక్క తన్ను తంతే ఆ దెబ్బకు ఎస్వీబీసి చైర్మన్ పదవి కాకిలా ఎగిరిపాయె.. ఏం చేయాలో తెలియక జగన్ను కాకా పడదామని ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని, టీడీపీ నేతలను తిట్టినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఈ వ్యవహారం బయటకు వచ్చాక కొంతకాలం రెస్ట్ తీసుకున్న పృథ్వీ రాజ్.. ఇప్పుడు మళ్ళీ తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. పదవి నుంచి తప్పుకున్న తర్వాత కాలి నడకన శ్రీవారి దర్శనానికి వచ్చారు. మరి ఆ ఏడుకొండలవారి దగ్గరకు ఏం ఆశించి వచ్చాడో ఈ రసిక రాజు అనుకుంటున్నారట..
ఇదిలా ఉండగా ఈయన చేసిన పనులు జగన్ను చాలా చిరాకు పెట్టించాయట.. రైతులపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆడియో టేప్ వ్యవహారం, ఎస్వీబీసిలో ఆయన చేసిన పనులు ఇలా అన్నీ కూడా వివాదాలకు కేంద్రంగా మారాయని, అందుకే జగన్ ఆయన్ను పక్కన పెట్టారని, అందువల్ల పార్టీలో పదవి ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. మరి ఈ దశలో సినిమా అవకాశాలు ఇదివరకటిలా వస్తాయో, లేదో చూడాలి. అయితే ఇప్పుడున్న పరిస్దితిని బట్టి చూస్తే ఈ కామెడీ నటుడి జీవితం చాలా కామెడీగా మారి రెంటికి చెడ్డ రేవడిలా అయ్యిందని కొందరు సెటైర్లు వేసుకుంటున్నారట..