నిన్న మొన్నటి దాక ఇండస్ట్రీలో గాసిప్ గా హడావిడి చేసిన వార్త ఇప్పుడు వంశీ పైడి పల్లి మహేష్మూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో ఆ గాసిప్ నిజం అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలు మొదలయ్యాయి. చిరంజీవి కొరటాల మూవీలో రామ్ చరణ్ కు 40 నిముషాల ప్రత్యేక పాత్ర క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.


అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ వాయిదా పడటంతో ఇప్పట్లో ఈ మూవీలో చరణ్ నటించే పరిస్థితి లేదు. ఒకవేళ చరణ్ నటించినా ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లోపు విడుదల చేసే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితులలో చరణ్ పాత్రను మహేష్ చేత నటింప చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కొరటాలకు వచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. 


మొదట్లో ఈ వార్తను కేవలం గాసిప్ గా ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అయితే ఇప్పుడు ఆ గాసిప్ యదార్థ వార్తగా మారే పరిస్థితులు చాల వేగంగా రూపు దిద్దుకుంటున్నాయి అంటూ కొందరు భావిస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ కేవలం 25 రోజలు కాల్ షీట్లు ఇవ్వడానికి అందుకు మహేష్ కు భారీ రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


ఈ చర్చలు స్వయంగా కొరటాల రాయబారాల మధ్య జరుగుతున్నట్లు టాక్. మహేష్ కు ఎంత భారీ పారితోషికం ఇచ్చినా అతడు ఈ ప్రాజెక్ట్ లో చేరడం వల్ల ఈ మూవీ బిజినెస్ చాల సునాయాసంగా 150 కోట్ల రేంజ్ లో చేయవచ్చనీ దీనివల్ల అదనంగా భారీ లాభాలు వస్తాయని కొరటాల మెగా కాంపౌండ్ కు ఇప్పటికే లెక్కలు వేసి చూపించినట్లు టాక్.  కొరటాల సన్నిహితుల ద్వారా అందుతున్న లీకుల ప్రకారం ఈ విషయమై క్లారిటీ మరికొద్ది రోజులలో ఖచ్చితంగా వస్తుంది అని అంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: