ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని అమరావతిని కాదని, మరో ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం పై ఇప్పుడు ఎన్నో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంత రైతులు గత రెండు నెలలుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఇక విపక్షాలు కూడా ప్రభుత్వం పై అదే స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదనే చెప్పాలి. త్వరలో రాజధానిని మార్చడానికి జగన్ సిద్దమవుతున్నారు. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు సిని పెద్దలు కూడా రాజధాని మార్పు విషయంలో కంగారు పడుతున్నారు. చంద్రబాబు రాజధానిగా అమరావతిని ప్రకటించిన సమయంలో అమరావతిలో భారీగా భూములు కొనుగోలు చేసారు కొందరు సినీ పెద్దలు. హీరోలు హీరోయిన్లు చాలా మంది అక్కడ భూములు కొన్నారు. ఇప్పుడు రాజధాని మార్చాలని జగన్ నిర్ణయం తీసుకోవడంతో వారిలో ఆందోళన మొదలయింది. మార్చొద్దు అని కోరుతున్నారు వాళ్ళు. తాజాగా సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అమరావతికి మద్దతు తెలిపారు. 

 

3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని, ఎక్కడి నుంచి పాలన జరిగితే అదే రాజధాని అవుతుందని, కొత్తగా పేరు పెట్టినంత మాత్రాన రాజధానులు కావని అన్నారు ఆయన. మంచికో, చెడుకో అమరావతి రాజధాని అంటూ సుమారుగా ప్రజాధనం రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టారని, మరో రూ.2 వేల కోట్లు పెడితే అది పూర్తవుతుందని, రాజధాని విషయం పక్కన పెడితే అసెంబ్లీలో నేతలు బూతులు తిట్టుకున్నారని, తెలుగు వాడమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ముందు సంస్కారవంతులుగా మారాలనితాను కోరుకుంటున్నానని అన్నారు. కాగా అమరావతిలో కొందరు అగ్ర నిర్మాతలు కూడా భూములు కొన్నారని వార్తలు వచ్చాయి. ఇక హీరోయిన్ అనుష్క కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేసారనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: