టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల వారసులు వెండి తెరకు పరిచయం అయ్యారు. కొంత కాలంగా స్టార్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తనయులు కూడా హీరోలుగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.  ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు శీను’ మూవీతో హీరోగా పరిచయం అయ్యారు.  ఈ మూవీ వివివినాయక్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం లాంటి అగ్రనటులతో తెరకెక్కింది.  ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ నటన, డ్యాన్స్, ఫైట్స్ ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో మెచ్చుకున్నారు.  దాంతో ఈ హీరోకి మంచి భవిష్యత్ ఉందని భావించారు. కానీ తర్వాత వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.  

 

స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోయిన్స్ తో సినిమాలు తీసినప్పటికీ బెల్లంకొండ కుర్రాడికి ఏమీ కలిసి రాలేదు.  గత ఏడాది ‘రాక్షసుడు’ లాంటి క్రైమ్, థ్రిల్లర్ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. వాస్తవానికి బెల్లకొండ శ్రీనివాస్ కి మాస్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు వుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను తన వైపుకు తిప్పుకునే కథలను ఎంచుకోవడానికి ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్ తరహా సినిమాలతో తనకు ఏమీ లాభం రాలేదని ఈ కుర్ర హీరో గ్రహించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు. ఈ సినిమా 'కందిరీగ' మాదిరిగానే నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తుందని అంటున్నారు.

 

గతంలో అల్లుడుశీను మంచి కామెడీ ఎంట్రటైన్ మెంట్ తో సూపర్ హిట్ అయ్యింది.  ఇక రామ్ నటించిన కందిరీగ కూడా కామెడీ ఎంట్రటైన్ మెంట్ తో మంచి విజయం అందుకుంది. అందుకే ఇప్పుడు బెల్లంకొండ శ్రీను కామెడీకే పెద్ద పీఠ వేయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో నభా నటేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్రలు అదే తరహాలో సందడి చేస్తాయట. ఇక 'కందిరీగ'లో విలన్ గా చేసిన సోనూ సూద్, ఈ సినిమాలోనూ విలన్ గా  కనిపించనున్నాడు. రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఫైట్స్ కి పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారట.  మొత్తానికి బెల్లంకొండను సంతోష్ శ్రీనివాస్ కొత్తగా చూపించనున్నాడన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: