భారత సినిమా చరిత్రలోనే తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న తార ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీదేవినే.. ఏ పాత్ర ఇచ్చిన సరే ఆ పాత్రలో మునిగిపోయి నటిస్తారు శ్రీదేవి.. అందుకే శ్రీదేవి అంటే ఎంతోమందికి ఇష్టం.. ప్రపంచం అంత ఆమెకు అభిమానులు ఉన్నారు.. ఆమె సినిమాల కోసం ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూసేవారు.. 

 

అలాంటి అద్భుత నటి శ్రీదేవి.. అలాంటి ఈ శ్రీదేవి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి బాలనటిగా అడుగు పెట్టింది.. బాలనటిగానే ఎన్నో సినిమాల్లో నటించింది. బాలనటిగా సీనియర్ నటులతో బాల్యంలోనే నటించింది. అలాంటి శ్రీదేవి.. మానవరాలిగా ఎవరితో అయితే నటించిందో వాళ్ళతోనే హీరోయిన్ గా నటించి తన సత్తా ఏంటో చూపించింది ఈ తార. 

 

అలాంటి ఈ తార ఏ హీరోతో మానవరాలిగా నటించి హీరోయిన్ గా నటించిందో ఇక్కడ చదివి తెలుసుకోండి. బాలనటిగా తెలుగులో బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆతర్వాత 16 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ సరసన వేటగాడు సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సర్దార్ పాపారాయుడు, గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, అనురాగదేవత వంటి ఎన్నో హిట్ సినిమాల్లో శ్రీదేవి నటించింది.

 

ఒక్క ఎన్టీఆర్ ఏ కాదు.. ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలతో శ్రీదేవి బాలనటిగా మనవరాలిగా, కూతురిగా నటించి ఆ తర్వాత వారి సరసన హీరోయిన్ గా నటించింది. ఏఎన్నార్ తో ముద్దుల కొడుకు, ముద్దుల మొగుడు, శ్రీరంగనీతులు, బంగారు కానుక, ప్రేమ కానుక, ప్రేమాభిషేకం, సత్యం శివం అనే సినిమాలలో శ్రీదేవి నటించింది. 

 

సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కలిసి బుర్రిపాలెం బుల్లోడు సినిమాలో నటించారు.. ఆతర్వాత సమాజానికి సవాల్, రామ్ రహీమ్, రాబర్ట్, ఘరానా దొంగ, దేవుడిచ్చిన కొడుకు, చుట్టాలున్నారు జాగ్రత్త, బంగారు బావ, గడసరి అత్త సొగసరి కోడలు, కలవారి సంసారం, బంగారు భూమి, వజ్రాయుధం వంటి సినిమాల్లో నటించింది. 

 

కృష్ణంరాజు శ్రీదేవి కలిసి నటించిన మొదటి సినిమా పులిబిడ్డ.. ఆ సినిమా తర్వాత.. త్రిశూలం, అడవి సింహాలు, బాబులు గాడి దెబ్బ అనే సినిమాల్లో కలిసి నటించారు.. ఆ తర్వాత శోభన బాబు సినిమాలో అతనికి కూతురుగా చేసిన శ్రీదేవి.. ఆతర్వాత శోభన్ బాబుతో ఎన్నో సినిమాల్లో నటించారు.. బంగారు చెల్లెలు, మోసగాడు, ఇల్లాలు, కృష్ణార్జునులు, దేవత, కోడెత్రాసు అనే సినిమాల్లో శోభన్ బాబు సరసన శ్రీదేవి నటించారు.

 

ఇలా కూతురుగా.. మానవరాలిగా నటించిన శ్రీదేవి వారి పక్కనే హీరోయిన్ గా నటించిన ఘనత ఈమెకే సొంతం అయ్యింది. అంతేకాదు.. అక్కినేని నాగేశ్వర్ రావు సరసన మనవరాలికి.. హీరోయిన్ గా నటించిన శ్రీదేవి ఆ తర్వాత కొడుకు నాగార్జున సరసన కూడా హీరోయిన్ గా నటించింది శ్రీదేవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: